ఆజంఖాన్ గేదెలు దొరికాయి: ఆఫీసర్లకు మూడింది
లక్నో: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ వ్యవహరించారు. దొంగతనానికి గురైన మంత్రిగారి ఏడు గేదెలు దొరికాయి. రాంపూర్లోని ఆయన ఫామ్హౌస్ నుంచి గేదెలు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. గేదెల కోసం అధికారులతో కూడిన పోలీసు బృందం గాలించింది. పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు.
శునకాలను కూడా రప్పించారు. రోజంతా గాలించిన తర్వాత గేదెలు పోలీసుల చేతికి చిక్కాయి. విధులను నిర్లక్ష్యం చేసినందుకు ముగ్గురు అధికారులపై బదిలీ వేటు పడింది. ఉత్తర్ ప్రదేశ్లోని రాంపూర్లో గల అజమ్ ఖాన్ ఫాం హౌస్లో ఉన్న గేదెలను కొందరు శనివారంనాడు దొంగిలించారు. చుట్టు ఉన్న ఇనుప కంచెను తొలగించి వాటిని తీసుకు వెళ్లారు. పలువురు పోలీసులు దొంగిలించిన వారిని పట్టుకొని, గేదెలను వెనక్కి తీసుకు వచ్చే పనిలో పడ్డారు. సమీపంలోని మూడు పోలీసు స్టేషన్ల నుండి పోలీసులు వెళ్లి వాటి కోసం గాలించారు.
రాంపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సాధనా గోస్వామి ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్కు నేతృత్వం వహిస్తున్నారు. గేదెలను ట్రేస్ చేసేందుకు స్నిఫ్పర్ డాగ్స్ను కూడా ఉపయోగిస్తున్నారు. అజమ్ ఖాన్ ఉత్తర ప్రదేశ్ మైనార్టీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు.
మంత్రిగారి ఫామ్ హౌస్ రాంపూర్ జిల్లాలాలోని థనగంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని పసియాపురా గ్రామంలో ఉంది. గేదెలు దొంగతనానికి గురయ్యాయనే విషయం తెలియగానే రాంపూర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫుట్ ఫ్రింట్స్ ఆధారంగా గుర్తించేందుకు విఫలయత్నం చేశారు.