వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుగర్ మిల్లులో అగ్ని ప్రమాదం: ఒకరు మృతి, భారీగా ఆస్తి నష్టం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని మొహియుద్దీన్‌పూర్‌లోని చక్కెర మిల్లులో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చక్కెర మిల్లు ఉద్యోగులు, అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసు అధికారులు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు.

 UP: Fire Breaks Out In Meerut Sugar Mill, one killed, Fire Tenders Rushed To Spot

ఆరు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఒకరు మృతి చెందినట్లు, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు చెప్పారు.

కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జిఆర్‌పి) బ్యారక్ ఎదురుగా ఉన్న రైల్ బజార్‌లోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అంతకుముందు రోజు మంటలు చెలరేగాయి.

నవంబర్ నెల ప్రారంభంలో, యూపీలోని సహరాన్‌పూర్‌లోని పేపర్ మిల్లులో మంటలు చెలరేగడంతో 57 ఏళ్ల వ్యక్తి కాలి బూడిదయ్యాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్టార్ పేపర్ మిల్లు గోడౌన్ వద్ద ఈ ఘటన జరిగింది.
బాధితుడిని లాల్ బహదూర్ మండల్ పేపర్ మిల్లు గోడౌన్ ఇన్‌చార్జిగా గుర్తించారు. రాత్రి డ్యూటీలో ఉన్న అతడు మిల్లులో మంటలు చెలరేగడంతో లోపలే చిక్కుకుపోవడంతో సజీవ దహనమయ్యాడు.

English summary
UP: Fire Breaks Out In Meerut Sugar Mill, one killed, Fire Tenders Rushed To Spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X