విషాదం: సెప్టిక్ ట్యాంకులో పడిన బాలుడిని కాపాడబోయి ఐదుగురు మృతి
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో విషాదం చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంకులో పడిన చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించి మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. ఐదుగురు మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆగ్రా ఫతేహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాపూర్ గ్రామంలో పదేళ్ల బాలుడు అనురాగ్ ఆడుకుంటూ వెళ్లి ఇంటి సమీపంలోని సెప్టిక్ ట్యాంకులో పడిపోయాడు. బాలుడిని కాపాడేందుకు మరో నలుగురు వెళ్లి, వారు కూడా సెప్టెక్ ట్యాంకులో పడిపోయారు.

గమనించిన స్థానికులు వెంటనే వారిని బయటికి తీసి సమీపంోలని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఈ ఐదుగురు కూడా మరణించారని వైద్యులు వెల్లడించారు. మరణించినవారిని అనురాగ్, సోను(12), రామ్ ఖిలాడీ హరిమోహన్(16), అవినాశ్(12)గా గుర్తించారు. కాగా, వీరిలో అవినాశ్, అనురాగ్, హరిమోహన్ సోదరులు కావడం గమనార్హం.
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications