వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర మంత్రులపై నితీష్ కుమార్ అసంతృప్తి: రాజీలేదని వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

పాట్నా: ఇద్దరు కేంద్ర మంత్రుల తీరుపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. ఈ విషయంలో తాను ఎప్పుడూ రాజీ పడలేదని స్పష్టం చేశారు.

లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెసు పార్టీలతో తెగదెంపులు చేసుకుని ఎన్డీఎ కూటమిలో చేరిన నితీష్ కుమార్ పరోక్షంగా బిజెపిని తప్పు పట్టారు. అవినీతిపైగానీ, సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించే శక్తులతో గానీ తాను రాజీ పడలేదని చెప్పారు.

Nitish Kumar

తాను మత, సామాజిక శాంతికి కట్టుబి ఉన్నట్లు తెలిపారు. ప్రేమ, దయాగుణం, మతసామరస్య భావనలతోనే దేశం ముందుకు సాగుతుందని ఆయన అన్నారు.

దళితులు, మైనారిటీల విషయంలో బిజెపి దృక్పథం మారాలనే కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అభిప్రాయంతో ఆయన ఏకీభవించారు. తనకు రామ్ విలాస్ పాశ్వాన్ తనకు బాగా తెలుసునని, ఆలోచన లేకుండా పాశ్వాన్ ఈ విషయాలపై మాట్లాడబోరని నితీష్ అన్నారు.

నితీ్ష్ కుమార్ వ్యాఖ్యలపై వ్యాఖ్యానించడానికి బిజెపి నిరాకరించింది. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, అశ్విని చౌబే వ్యాఖ్యలపై అసెంబ్లీలో దుమారం చేలరేగిన నేపథ్యంలో నితీష్ కుమార్ అలా మాట్లాడారు

ఆర్జెడి విజయం సాధించడంపై గిరిరాజ్ సింగ్ ప్రతిస్పందిస్తూ - అరారియా ఉగ్రవాద నిలయంగా మారుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద యెత్తున దుమారం చెలరేగింది. కాగా, తన కుమారుడ్ అరిజిత్ శాశ్వత్ మితవాద కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో భాగల్పూర్‌లో రెచ్చగొట్టే నినాదాలు చేశారు. అది ఘర్షణలు దారి తీసింది. దీంతో మంత్రి అశ్విని చౌబే వివాదంలో చిక్ుకున్నారు.

English summary
Bihar Chief Minister Nitish Kumar on Monday made it clear that he is upset with two Union Ministers, supported a third who advised course correction to the BJP and renewed his demand for special status for Bihar, claiming he has never given up on the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X