రాజ్పథ్ను 'నో ఫ్లై జోన్'గా ప్రకటించండి: అమెరికా, కుదరదన్న కేంద్రం
న్యూఢిల్లీ: భారత్లో ప్రతి ఏడాది జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్ ఉత్సవాలకు తొలిసారి ఓ అమెరికా అధ్యక్షుడు రానున్న తరుణంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు వేదికపై ఉండే సమయంలో రాజ్పథ్ రహదారిని విమానరహిత ప్రాంతం (నో ఫ్లై జోన్)గా ప్రకటించాలని అమెరికా కోరింది.
దీనికి కేంద్రం ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేసింది. రాజ్పథ్ను విమాన రహిత ప్రాంతంగా ప్రకటిస్తే, పరేడ సమయంలో యుద్ధ విమాన విన్యాసాలను రద్దు చేయాల్సి ఉంటుంది. భారత వైమానిక ప్రదర్శన లేకుండా ఇంత వరకూ ఒక్క రిపబ్లిక్ పరేడ్ కూడా నిర్వహించలేదు.

అమెరికా కోరిన ఈ కోరికను ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించబోమని కేంద్ర ప్రభుత్వ అధికారి చెప్పినట్లు తెలుస్తోంది. రిపబ్లిక్ పరేడ్ వేడుకల్లో భాగంగా భారత వైమానికి దళం కేవలం 10 నిమిషాలు మాత్రమే తన ప్రదర్శనను ఇస్తుంది. సంవత్సరమంతా రాష్ట్రపతి భవనం, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, ప్రధానమంత్రి నివాసం విమానరహిత ప్రాంతం (నో ఫ్లై జోన్)గానే ఉంటుందని పేర్కొన్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications