JD Vance: ఢిల్లీలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-రాత్రికి మోడీతో డిన్నర్..!
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా ఇవాళ డిల్లీ చేరుకున్నారు. సతీమణి ఉషావాన్స్, ముగ్గురు పిల్లలతో పాటు ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్ లో దిగిన జేడీ వాన్స్ కు ఘనస్వాగతం లభించింది. అక్కడ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయనకు స్వాగతం పలికారు. భారత్ అల్లుడైన జేడీ వాన్స్ తన నాలుగు రోజుల టూర్ లో భాగంగా దేశంలోని పలు పర్యాటక స్థలాల్ని సందర్శించనున్నారు. అలాగే ఇవాళ రాత్రికి ప్రధాని మోడీతో కలిసి డిన్నర్ చేస్తారు. భారత్-అమెరికా సంబంధాలపై చర్చలు కూడా జరపనున్నారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇవాళ రాత్రికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సమావేశం నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో సహా దాదాపు 60 దేశాలపై భారీ సుంకాల విధానాన్ని విధించి, ఆపై తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత వాన్స్ భారత్ కు తొలిసారి అధికారిక పర్యటనపై వచ్చారు. దీంతో జేడీ వాన్స్ టూర్ లో ఇరుదేశాల మధ్య పలు అంశాలపై చర్చలు జరిగే అవకాశముంది.

ఢిల్లీలో దిగిన తర్వాత జేడీ వాన్స్ కుటుంబం స్వామినారాయణ్ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. సాంప్రదాయ హస్తకళా వస్తువులను విక్రయించే షాపింగ్ కాంప్లెక్స్ను సందర్శించే అవకాశం ఉంది. సాయంత్రం 6:30 గంటలకు అధికారిక చర్చల కోసం వాన్స్ ప్రధాని అధికారిక నివాసమైన 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో మోడీని కలుస్తారు. అనంతరం జైపూర్కు బయలుదేరి వెళ్లనున్నారరు.
#WATCH | Delhi: Vice President of the United States, JD Vance, Second Lady Usha Vance, along with their children, at Palam airport.
— ANI (@ANI) April 21, 2025
Vice President JD Vance is on his first official visit to India and will meet PM Modi later today. pic.twitter.com/LBDQES2mz1
జైపూర్లో జేడీ వాన్స్ కుటుంబం అమెర్ కోటను సందర్శిస్తారు. జైపూర్ పర్యటన తర్వాత వాన్స్ తన కుటుంబంతో కలిసి ఆగ్రాను సందర్శించే అవకాశం ఉంది. అక్కడ వారు తాజ్ మహల్ను సందర్శిస్తారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలకనున్నారు. జేడీ వాన్స్ భారత పర్యటనలో రెండు దేశాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడంపై చర్చించనున్నాయి. ఈ భేటీలో సుంకాలు, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన అంశాలపైనా ఇరుదేశాలు చర్చించే అవకాశం ఉంది.
-
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
H-1B వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్..! వేతనాల పెంపు ఇలా...! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య..












Click it and Unblock the Notifications