Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Noida: రాజు కొడుకు రారాజు, పంకజ్ సింగ్ సిక్స్ కు పగిలిపోయింది, ఊరే దాటింది, 1, 81 లక్షల మెజారిటి !

నోయిడా/లక్నో: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ కొట్టిన దెబ్బకు సమాజ్ వాదీ పార్టీ పర్వాలేదు అనిపించుకున్నా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ మాత్రం గల్లంతు అయ్యింది. బీజేపీ కొట్టిన దెబ్బకు ఎస్పీ, కాంగ్రెస్ నాయకుల మైండ్ బ్లాక్ కావడమే కాకుండా ఆ పార్టీ చెప్పుకోలేని దీనస్థితిలోకి వెళ్లిపోయింది. ఉత్తరప్రదేశ్ లో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ప్రచారంతో పాటు సినీగ్లామర్ ఏమాత్రం పని చెయ్యలేదు. బీజేపీ కొట్టిన సిక్స్ కు కాంగ్రెస్ అనే బాల్ స్టేడియం దాటిపోయి ఆ బాల్ కంటికి కనపడకుండా పోయింది.

ఉత్తరప్రదేశ్ లోని అనేక అసెంబ్లీ నియోజక వర్గాల్లో భారీ మెజారిటీతో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. కేంద్ర రక్షణ శాఖా మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ నాయకుల గూబ గుయ్య్ అని రీసౌండ్ వస్తోంది. రాజ్ నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ ఉత్తరప్రదేశ్ లోని నోయిడా అసెంబ్లీ నియోజక వర్గం ఎన్నికల్లో ఏకంగా 1. 81 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఖంగుతిన్నారు.

 రాహుల్ అన్న, ప్రియాంకా అక్క ప్రచారం

రాహుల్ అన్న, ప్రియాంకా అక్క ప్రచారం

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ కొట్టిన దెబ్బకు సమాజ్ వాదీ పార్టీ పర్వాలేదు అనిపించుకున్నా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ మాత్రం గల్లంతు అయ్యింది. బీజేపీ కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ నాయకుల మైండ్ బ్లాక్ కావడమే కాకుండా ఆ పార్టీ చెప్పుకోలేని దీనస్థితిలో వెళ్లిపోయింది. ఉత్తరప్రదేశ్ లో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ప్రచారంతో పాటు సినీగ్లామర్ ఏమాత్రం పని చెయ్యలేదు.

 ప్రధాని మోదీ బొమ్మ, యోగి మంత్రం

ప్రధాని మోదీ బొమ్మ, యోగి మంత్రం

బీజేపీ కొట్టిన సిక్స్ కు కాంగ్రెస్ అనే బాల్ స్టేడియం దాటిపోయి ఆ బాల్ కంటికి కనపడకుండా పోయింది. ఉత్తరప్రదేశ్ లోని అనేక అసెంబ్లీ నియోజక వర్గాల్లో భారీ మెజారిటీతో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బొమ్మతో పాటు యోగి ఆదిత్యనాథ్ జపం చేసిన బీజేపీ నాయకులు సులభంగా ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.

 రాజు కొడుకు రారాజు అనిపించుకున్నాడు

రాజు కొడుకు రారాజు అనిపించుకున్నాడు

కేంద్ర రక్షణ శాఖా మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ కుమారుడు కంపజ్ సింగ్ కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ నాయకుల గూబ గుయ్య్ అని రీసౌండ్ వస్తోంది. రాజ్ నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ ఉత్తరప్రదేశ్ లోని నోయిడా అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 1. 81, 513 ఓట్ల ఓట్ల మెజారిటీతో విజం సాధించడంతో కాంగ్రెస్ నాయకులు ఖంగుతిన్నారు.

 పంకజ్ దెబ్బకు పగిలిపోయింది

పంకజ్ దెబ్బకు పగిలిపోయింది

రాజ్ నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ కు 2, 44, 319 ఓట్లు వచ్చాయి, ఎస్ పీ అభ్యర్థి సునీల్ చౌదరికి 62, 806 ఓట్లు మాత్రమే వచ్చాయి, బీఎస్పీకి 16, 292 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2017లో నోయిడా అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన పంకజ్ సింగ్ 1, 04, 016 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు అయితే ఇప్పుడు దాదాపుగా 80 వేల అధిక ఓట్లతో మరోసారి పంకజ్ సింగ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+