కోర్టులోనే కాల్పులు...యూపి బార్ కౌన్సిల్ చైర్మన్ పై మరో అడ్వకేట్ కాల్పులు

ఆగ్రా జిల్లా కోర్టు అవరణలో దారుణం జరిగింది. కోర్టు ఆవరణలోనే ఓ అడ్వకేట్ నేరుగా మరోకరిపై కాల్పులు జరిపారు. యూపి బార్ కౌన్సిల్ చైర్‌పర్సన్‌పై దుండగుడు మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. అనంతరం కాల్పులు జరిపిన వ్యక్తి కూడ తనకు తాను కాల్చుకున్నాడు. దీంతో ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా బార్ కౌన్సిల్ చైర్‌పర్స్‌న్ అసుపత్రిలో చికిత్స పోందుతూ మ‌ృతి చెందింది. కాల్పులకు పాల్పడ్డ మరో అడ్వకేట్ పరిస్థితి కూడ విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

కాగా యూపి బార్ కౌన్సిల్ చైర్‌పర్సన్ ఎన్నికైన దర్వేశ్ యాదవ్ మరో అడ్వకేట్ అయినా మనిష్ శర్మ కాల్పులు జరిపాడు. అనంతరం తాను కూడ కాల్చుకున్నాడు. కాగా రెండు రోజుల క్రితమే దర్వేశ్ యాదవ్ ఉత్తర్ ప్రదేశ్ బార్ కౌన్సీల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయింది. దీంతో ఆమేకు ఆగ్రా కోర్టులో సన్మాన కార్యక్రమాన్ని తోటీ అడ్వకేట్‌లు ఏర్పాటు చేశారు. దీంతో సన్మాన కార్యక్రమానికి హజరైన ఆమేను మనీష్ శర్మ తన వద్ద ఉన్న లైసన్స్‌డ్ తుపాకితో మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు.

Uttar Pradesh Bar Council chairperson Darvesh Yadav was shot dead

ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో దగ్గరలోని పుష్సాంజలీ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స సమయంలోనే దర్వేష్ యాదవ్ మ‌ృతి చెందగా మహేశ్ శర్మ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాగా ఉత్తర ప్రదేశ్ బార్ కౌన్సిల్‌ చైర్ పర్సన్‌గా ఎన్నికైన మొదటి మహిళ దర్వేశ్ యాదవ్.పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు.కాగా రేపు నిరసన వ్యక్తం చేసేందుకు యూపి లాయర్లు నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+