Loudspeakers: మసీదులు, ప్రార్థనా మందిరాల్లో లౌడ్ స్పీకర్లు తొలగింపు, ఎక్కువ సౌండ్, సీఎం ఆర్డర్ తో!
లక్నో/వారణాసి: ఉత్తరప్రదేశ్ లో వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ముస్లీం సోదరులకు ఊహించని షాక్ ఇచ్చింది. మసీదుల్లో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లు తొలగించాలని ఇప్పటికే మతపెద్దలకు నోటీసులు ఇచ్చిన యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు రంగంలోకి దిగి లౌడ్ స్పీకర్లు తొలగించే పనిలో నిమగ్నం అయ్యింది. స్థానికులకు ఇబ్బంది కలిగించే విదంగా మసీదుల్లో ఎక్కువ సౌండ్ తో లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేశారని స్థానికులు ఫిర్యాదులు చేశారని, అందుకే ఎక్కువ సౌండ్ తో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లు తొలగించామని అధికారులు అంటున్నారు.
మసీదుల్లో ఇప్పటి వరకు ఎన్నివేల లౌడ్ స్పీకర్లు తొలగించాము అనే విషయంపై అలహాబాద్ హైకోర్టులో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. మసీదుల్లో, ప్రార్థనా మందిరాల్లో ఎక్కువ సౌండ్ తో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లు గుర్తించి వాటిని తొలగిస్తామని అధికారులు అంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 12 జోన్లలో ఎక్కడెక్కడ ఎన్ని వేల లౌడ్ స్పీకర్లు తొలగించాము అనే విషయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పక్కా లెక్కలను హైకోర్టుకు సమర్పించారు.

ముస్లీం సోదరులకు షాక్ ఇచ్చిన యోగి ప్రభుత్వం
ఉత్తరప్రదేశ్ లో వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ముస్లీం సోదరులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా మసీదుల్లో ఎక్కువ సౌండ్ తో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లు గుర్తించారు. మసీదుల్లో ఎక్కువ సౌండ్ తో మతప్రచారం చేస్తున్నారని కొన్ని ప్రాంతాల్లోని స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నారని అధికారులు అంటున్నారు.

మత పెద్దలకు నోటీసులు
మసీదుల్లో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లు తొలగించాలని ఇప్పటికే మతపెద్దలకు నోటీసులు ఇచ్చిన యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు రంగంలోకి దిగి లౌడ్ స్పీకర్లు తొలగించే పనిలో నిమగ్నం అయ్యింది. స్థానికులకు ఇబ్బంది కలిగించే విదంగా మసీదుల్లో ఎక్కువ సౌండ్ తో లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేశారని స్థానికులు ఫిర్యాదులు చేశారని అధికారులు అంటున్నారు.

మతపరమైన ప్రదేశాలు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మతపరమైన ప్రదేశాల్లో ఎక్కువ సౌండ్ తో ఏర్పాటు చేసిన 10, 923 లౌడ్ స్పీకర్లు తొలగించింది. మతపరమైన ప్రాంతాల్లో 35, 221 చోట్ల లౌడ్ స్పీకర్ల సౌండ్ ను తగ్గించిందని అధికారులు అంటున్నారు. అయితే కొత్తగా లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చెయ్యడానికి ఎలాంటి అనుమతి మంజూరు చెయ్యబడదు అని అధికారులు తెలీపారు.

సీఎం ఆదేశాలలో!
లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో స్థానికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్థానికులకు ఇబ్బంది కలిగించే విదంగా మసీదుల్లో ఎక్కువ సౌండ్ తో లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేశారని స్థానికులు ఫిర్యాదులు చేశారని, అందుకే ఎక్కువ సౌండ్ తో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లు తొలగించామని అధికారులు అంటున్నారు.

హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్
రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనా మందిరాల్లో, మసీదుల్లో ఇప్పటి వరకు ఎన్నివేల లౌడ్ స్పీకర్లు తొలగించాము అనే విషయంపై అలహాబాద్ హైకోర్టులో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. మసీదుల్లో, ప్రార్థనా మందిరాల్లో ఎక్కువ సౌండ్ తో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లు గుర్తించి వాటిని తొలగిస్తామని ఉత్దరప్రదేశ్ లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ ప్రశాంత్ కుమార్ అంటున్నారు.

అధికారుల పక్కాలెక్కలు
అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 12 జోన్లలో 10, 923 లౌడ్ స్పీకర్లు తొలగించాము అని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పక్కా లెక్కలను హైకోర్టుకు సమర్పించారు. లక్నో జోన్ లో 2,395, గోరఖ్ పూర్ జోన్ లో 1, 788, వారణాసి జోన్ లో 1, 366, మీటర్ జోన్ లో 1,204తో పాటు ప్రయోగ్ రాజ్ జోన్ లో అధిక సంఖ్యలో లౌడ్ స్పీకర్లు తొలగించామని ఉత్తరప్రదేశ్ అధికారులు తెలిపారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications