కశ్మీర్లో పట్టాలెక్కేందుకు రెడీ అవుతున్న వందేభారత్...
దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ప్రధాన నగరాలు, పట్టణాలను కలుపుతూ ఈ రైళ్లు నడుస్తున్నాయి. ఆధునాతన సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ వందేభారత్ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికి వీటికి మంచి ఆదరణే లభిస్తుంది. తాజాగా కశ్మీర్లో పట్టాలెక్కేందుకు రెడి అవుతుంది వందేభారత్.. ఇదే విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించడం జరిగింది.
త్రిపురలో కూడా ఈ రైళ్లు అందుబాటులోకి : ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా జమ్ము -శ్రీనగర్ లైన్లో వందేభారత్ రైళ్ల సర్వీస్లు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఇప్పటికే జమ్ము-శ్రీనగర్ రైల్వే లైను పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే కశ్మీర్తో పాటు మరో రాష్ట్రంలో కూడా ఈ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోనూ సెమీ హై స్పీడ్ ట్రైన్స్ని నడిపే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రైల్వే లైన్ కన్ఫమ్ కాగానే వెంటనే ఈ రైళ్లు పట్టాలపైకి ఎక్కుతాయని చెప్పారు.

2024 మార్చి నాటికి.. 75 వందేభారత్ : 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 75 వందేభారత్ రైళ్లను నడపడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లకి ప్రత్యామ్నాయంగా వందేభారత్ స్లీపర్ ట్రైన్స్నీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. జమ్ము-శ్రీనగర్ రైల్వే లైన్ క్లియర్ అయిన వెంటనే వందేభారత్ రైళ్లు పరుగులు పెడతాయని స్పష్టం చేశారు అశ్విని వైష్ణవ్. ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఈ ప్ర్రక్రియ పూర్తవుతుందని ఆయన అన్నారు. కశ్మీర్ వాతావరణానికి తగిన విధంగానే వందేభారత్ ట్రైన్స్ని రూపకల్పన చేస్తామని వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే దేశంలోని అన్ని వర్గాల వారికి ముఖ్యంగా యువత, వృద్ధులలో వందేభారత్ రైళ్లకి మంచి పాపులారిటీ లభించిందని ఆయన అన్నారు. అందుకే వీటి సంఖ్య కూడా పెంచే ఆలోచన చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications