గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు దొరైస్వామి కన్నుమూత
బెంగళూరు: ప్రముఖ గాంధేయవాది, స్వాతంత్ర్య సమర యోధుడు హెచ్ఎస్ దొరైస్వామి బుధవారం కన్నుమూశారు. 103 ఏళ్ల దొరైస్వామి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బెంగళూరులోని జయదేవ ఊపరితిత్తుల వ్యాధుల ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
మే 8న కరోనా సోకగా ఇదే ఆస్పత్రిలో చేరారు. మే 13న కోలుకుని ఇంటికి చేరుకున్నారు. అయితే, మరుసటి రోజు అస్వస్థతగా ఉందని తెలపడంతో ఆయనను మళ్లీ ఆస్పత్రిలో చేర్చారు. కాగా, దొరైస్వామి అస్తమా, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.

దొరైస్వామి భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని 14 నెలలు జైలు జీవితం గడిపారు. ఎమర్జెన్సీ కాలంలోనూ ఆందోళన చేస్తానని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి లేఖ రాయవడంతో ఆయనను 4 నెలలు జైలులో ఉంచారు.
అంతేగాక, గనుల మాఫియా, భూ కబ్జాలకు వ్యతిరేకంగా దొరైస్వామి పోరాటం చేశారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రవేశించే వరకు కూడా ఆయన ప్రజా ఉద్యమాల్లోనే కొనసాగడం గమనార్హం. దొరైస్వామి మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సంతాపం ప్రకటించారు. పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications