‘మాకు హితబోధ చేసే ముందు నల్లజాతివారిపై దాడులు ఆపండి’
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల భారత్పై వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మత సహనంపై భారత్కు హితబోధలు చేసే ముందు, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నల్లజాతివారిపై ఇప్పటికీ దాడులు జరుగుతున్న తమ దేశం గురించి ఆలోచిస్తే మంచిదంటూ విశ్వ హిందూ పరిషత్ ఆయనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
మిషనరీల కార్యకలాపాలకు తోడ్పడేందుకు చర్చి చొప్పించిన కొంతమందిని కలిసిన తర్వాత ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారని విహెచ్పి సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్ శుక్రవారం అన్నారు. రాజకీయాల్లోకి చర్చి చొప్పించిన వారుగా అనుమానాలున్న అలాంటి వారి పేర్లను ప్రభుత్వం బైటపెట్టాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

భారత్కు హితబోధలు చేసే ముందు ఒబామా అమెరికాలోని తన సొంతవారి గురించి ఆలోచించాలని, ఒక వేళ ఆయన హితబోధ చేయాలనుకుంటూ ఉంటే అమెరికా సాయంతో మత మార్పిడులు జరపడమే కాకుండా జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న క్రైస్తవ మిషనరీలకు హితబోధ చేయాలని జైన్ చెప్పారు.
‘ఒబామా స్వయంగా నల్లజాతి వారు. అయినప్పటికీ నల్లజాతి వారిపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపలేక పోతున్నారు' అని జైన్ ఆరోపించారు. భారత దేశంలో ఇటీవలి సంవత్సరాల్లో వివిధ మతాల వారిపై చోటు చేసుకుంటున్న ‘అసహన చర్యల'పై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గురువారం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
-
భారత్తో ఇరాన్ సుప్రీం లీడర్ "ఖమేనీ"కి ఉన్న ప్రత్యేక సంబంధం ఇదే !! -
ఇరాన్తో యుద్ధం అమెరికా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుందో తెలుసా..? -
Iran: 600 మందికిపైగా మృతి..? -
గల్ఫ్ దేశాల్లో భయం గుప్పిట్లో తెలంగాణా వాసులు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు, మంత్రి భరోసా! -
T20 World Cup ఫైనల్ వీరి మధ్యే..! తేల్చేసిన ఏఐ ప్లాట్ ఫామ్స్..! -
IND Vs ENG: సెమీస్ వర్షంలో కొట్టుకుపోతే, ఫైనల్ చేరేదెవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
Ind Vs Eng: సెమీస్ లో స్టార్ బ్యాటర్ పై వేటు, డేంజెరస్ హిట్టర్ ఇన్ - మార్పుల వెనుక..!! -
హోలీ ఎప్పుడు? మార్చి 3 లేదా 4నా - స్కూల్స్.. బ్యాంకుల సెలవుపై తాజా నిర్ణయం..!! -
దుబాయ్, అబుదాబీలో భారతీయులకు గుడ్ న్యూస్..! -
కీలక మలుపు తిరిగిన ఇరాన్ యుద్ధం.. చైనా ఎంట్రీ! -
మెగాస్టార్ సినిమాలో విలన్ గా మోహన్ బాబు..! -
సడన్ గా లబ్దిదారుల అకౌంట్ లో రూ.2,000 జమ: పింఛన్ + బోనస్












Click it and Unblock the Notifications