బెంగళూరుకు రావొద్దు: వీహెచ్పీ నేత తొగాడియాకు నోటీసులు
బెంగళూరు: సీనియర్ విశ్వహిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియాకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నగరంలోకి రావొద్దని మంగళవారం నోటీసులు ఇచ్చారు. బెంగళూరులో ఫిబ్రవరి 8న జరగనున్న హిందూ విరాట్ సమావేశాలకు ఆయన హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 5 నుండి 8వ తేదీ వరకు రావొద్దని సూచించారు.
అయితే, తొగాడియా రావొద్దని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రవీణ్ తొగాడియా వస్తే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారని, ఆయన పైన పలు కేసులు ఇప్పటికే నమోదై ఉన్నాయని చెబుతున్నారు. వీహెచ్పీ ఇటీవల ఘర్ వాపసీని ఉధృతం చేసిన విషయం తెలిసిందే. కర్నాటకలోని గుల్బర్గాలో 471 కుటుంబాలను తిరిగి హిందూమతంలోకి తీసుకు వచ్చినట్లుగా చెబుతున్నారు.

కాగా, తొగాడియాకు బెంగళూరు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఈ నోటీసులు జారీ చేశారు. అయితే, సెక్యూరిటీ కారణాలతో ఈ నోటీసులు ఇచ్చారు. తొగాడియా పైన విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులు ఉన్నాయని, ఇప్పుడు కూడా అలాంటివి చేయకూడదనే ఉద్దేశ్యంతో ఈ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications