మాజీ సిఎం కాళ్లు మొక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే...
రాజస్థాన్కు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ సిఎం కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్లో సోమవారం ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలోనే ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
రాజే కాళ్లు మొక్కిన జైన్: దివంగత తాన్ సింగ్ చౌహాన్ సంస్మరణ సందర్భంగా రాజస్థాన్లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ మాజీ సీఎం రాజే సహా పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి బార్మర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎన్నికైన ఎమ్మెల్యే మెవరమ్ జైన్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భారీ సంఖ్యలో బిజెపి, కాంగ్రెస్ నాయకులంతా వచ్చారు.

అయితే, వారంతా నేలపై కూర్చుని ఉన్నారు. అయితే, ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధరా రాజే కూడా వచ్చారు. అయితే, ఎమ్మెల్యే మెవరమ్ జైన్ వసుంధరా రాజేను చూసి..అక్కడ నేలపై కూర్చన్న వాళ్లను దాటుకుంటూ వెళ్లి రాజే కాళ్లుమొక్కి మరీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వీడియో కాస్త ఆ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాన్సింగ్ చౌహాన్ ఎందరికో స్పూర్తిదాయకం: ఈ వీడియో చూసిన రాజకీయ నాయకులు పలువురు పలురకాలుగా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. జైన్ కాళ్లు మొక్కడం చూసిన వసుంధరా రాజే వెంటనే మైక్ చేతిలోకి తీసుకుని మిమ్మల్ని ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఇది మనందరినీ ఏకం చేసేందుకు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం అని ఆమె అన్నారు.
ఆ తర్వాత రాజే మాట్లాడుతూ...మీడియా మిత్రులు నా మాటలు వినాలి. ఇది ఒక సామాజిక కార్యక్రమం. ఈ కార్యక్రమం 36 సామాజిక వర్గాలను కలుపడానికి పనిచేస్తుంది అంటూ పేర్కొన్నారు. అనంతరం దివంగత తాన్ సింగ్ చౌహాన్ గురించి మాట్లాడారు. తాన్ సింగ్ చౌహన్ అందరినీ ఏక తాటిపై నడిపించిన వ్యక్తి. డ్రైవర్ ఉద్యోగం నుంచి ఓ ప్రజా నాయకుడిగా ఎదిగిన ఆయన విధానం మనలాంటి వారెందరికో స్పూర్తిదాయకం అని కొనియాడారు.
#WATCH | राजस्थान विधानसभा चुनाव की तैयारियों के बीच एक वीडियो सामने आया है। मुख्यमंत्री अशोक गहलोत के करीबी लोगों में शुमार कांग्रेस विधायक मेवाराम जैन पूर्व मुख्यमंत्री वसुंधरा राजे से आशीर्वाद लेते नजर आए।#Rajasthan #RajasthanElection2023 pic.twitter.com/Ptlz3KH2Tz
— Hindustan (@Live_Hindustan) October 3, 2023
కాంగ్రెస్లో చేరుతారన్న ఊహగానాలు: అయితే, వసుంధరా రాజే త్వరలో కాంగ్రెస్లో చేరుతారన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే, దీనికి గల కారణాలు లేకపోలేదంటున్నారు విశేష్లకులు.. గత కొద్దీకాలంగా రాజస్థాన్లోని బీజేపీ పెద్దలు వసుంధరా రాజేను పట్టించుకోవడం లేదని ఆమె తన సొంత పార్టీపైనే ఆగ్రహంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
ఈ విషయంపై గత కొంతకాలంగా వసుంధరా రాజే పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ క్రమంలోనే ఇటీవల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను వసుంధరా రాజే కలిసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications