పీకలదాక లిక్కర్ తాగేసి పోలీసుల ఫోన్లు పలగొట్టిన లేడీస్, రచ్చరచ్చ చేసి బూతులతో !
ఉత్తరప్రదేశ్/లక్నో: ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లోని మార్కెట్లో ముగ్గురు మహిళలు రచ్చ సృష్టించి పోలీసు అధికారులను దుర్భాషలాడి బూతులు తిట్టినన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహిళలు మద్యం మత్తులో ఉన్నారని, ఈ సంఘటనను చిత్రీకరించకుండా ఆపడానికి ప్రయత్నిస్తుండగా, ఒక మహిళ యూనీఫామ్ లో ఉన్న కానిస్టేబుల్ నుండి మొబైల్ లాక్కొని నేలపై విసిరి పగలగొట్టిందని సమాచారం.
ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో వైరల్గా మారిన వీడియోలో ముగ్గురు మహిళలు పోలీసులతో గొడవపడ్డారు. మద్యం మత్తులో రెచ్చిపోతున్న లేడీస్ తతంగం ఘటనను తన ఫోన్ కెమెరాలో చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ పోలీసు అధికారిని ఆ మహిళలు దూషించారని తెలిసింది. ఒక మహిళా పోలీసు అధికారి సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆ మహిళలను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లే వరకు పోలీసులు వేచి ఉన్నారని నివేదికలు తెలిపాయి.

ఈ ఘటనను చిత్రీకరించకుండా అడ్డుకునే క్రమంలో ఓ మహిళ కానిస్టేబుల్ ఫోన్ లాక్కొని నేలపై విసిరేసింది. అలాగే ఈ ఘటన జరగడంతో కొద్దిసేపటికే చాలా మంది అక్కడికి చేరుకోవడంతో జనం అక్కడే నిలబడి ఈ ఘటనను చూస్తూనే ఉన్నారు. అయితే మహిళలను శాంతింపజేసి గొడవను అదుపు చేసేందుకు ఎవరూ ప్రయత్నించలేదని కూడా తెలిసింది.
అలాగే కొందరు ఈ దృశ్యాన్ని ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చెయ్యడంతో వైరల్గా మారింది.మహిళా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళలను పోలీస్ స్టేషన్కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ముగ్గురు మహిళలు పీకలదాక మద్యం మత్తులో ఉన్నట్లు వైద్యపరీక్షల నివేదికలో తేలింది. అనంతరం వారి కుటుంబాలను పోలీస్స్టేషన్కు పిలిపించి మహిళలను ఇంటికి పంపించినట్లు తెలిసింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications