Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పీకలదాక లిక్కర్ తాగేసి పోలీసుల ఫోన్లు పలగొట్టిన లేడీస్, రచ్చరచ్చ చేసి బూతులతో !

ఉత్తరప్రదేశ్/లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లోని మార్కెట్‌లో ముగ్గురు మహిళలు రచ్చ సృష్టించి పోలీసు అధికారులను దుర్భాషలాడి బూతులు తిట్టినన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళలు మద్యం మత్తులో ఉన్నారని, ఈ సంఘటనను చిత్రీకరించకుండా ఆపడానికి ప్రయత్నిస్తుండగా, ఒక మహిళ యూనీఫామ్ లో ఉన్న కానిస్టేబుల్ నుండి మొబైల్ లాక్కొని నేలపై విసిరి పగలగొట్టిందని సమాచారం.

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో వైరల్‌గా మారిన వీడియోలో ముగ్గురు మహిళలు పోలీసులతో గొడవపడ్డారు. మద్యం మత్తులో రెచ్చిపోతున్న లేడీస్ తతంగం ఘటనను తన ఫోన్ కెమెరాలో చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ పోలీసు అధికారిని ఆ మహిళలు దూషించారని తెలిసింది. ఒక మహిళా పోలీసు అధికారి సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆ మహిళలను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లే వరకు పోలీసులు వేచి ఉన్నారని నివేదికలు తెలిపాయి.

drinkingliquor1

ఈ ఘటనను చిత్రీకరించకుండా అడ్డుకునే క్రమంలో ఓ మహిళ కానిస్టేబుల్ ఫోన్ లాక్కొని నేలపై విసిరేసింది. అలాగే ఈ ఘటన జరగడంతో కొద్దిసేపటికే చాలా మంది అక్కడికి చేరుకోవడంతో జనం అక్కడే నిలబడి ఈ ఘటనను చూస్తూనే ఉన్నారు. అయితే మహిళలను శాంతింపజేసి గొడవను అదుపు చేసేందుకు ఎవరూ ప్రయత్నించలేదని కూడా తెలిసింది.

అలాగే కొందరు ఈ దృశ్యాన్ని ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చెయ్యడంతో వైరల్‌గా మారింది.మహిళా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళలను పోలీస్ స్టేషన్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ముగ్గురు మహిళలు పీకలదాక మద్యం మత్తులో ఉన్నట్లు వైద్యపరీక్షల నివేదికలో తేలింది. అనంతరం వారి కుటుంబాలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మహిళలను ఇంటికి పంపించినట్లు తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+