మాల్యా కావాల్సిందే: సుప్రీం, భారత్పై లిక్కర్ కింగ్ షాకింగ్ కామెంట్స్
బ్యాంకుల్లో అప్పులు చేసి విదేశాల్లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కేసు విచారణలో భాగంగా కోర్టులో హాజరు కావాల్సిందేనని సుప్రీం కోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది.
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో అప్పులు చేసి విదేశాల్లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కేసు విచారణలో భాగంగా కోర్టులో హాజరు కావాల్సిందేనని సుప్రీం కోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది.
అతనిని భారత్ తీసుకురావడానికి లండన్లో వేసిన కేసు వాయిదా పడిన విషయాన్ని సుప్రీం ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ వరకు ఈ కేసు విచారణ కొనసాగదన్నారు.
సాక్ష్యాధారాల పరిమాణం పెద్దగా ఉండటం వల్ల వాటిని కుదించమని చెబుతూ లండన్ కోర్టు విజయ్ మాల్యా కేసును డిసెంబర్ వరకు వాయిదా వేసింది.
అలాగే జీ20 సమావేశాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ ప్రధాని థెరెసా మేతో విజయ్ మాల్యా విషయమై చర్చించారని చెబుతున్నారు.

మాల్యా షాకింగ్ సమాధానం
భారత దేశంతో తనకు మానసిక సంబంధం ఏదీ లేదని విజయ్ మాల్యా చెప్పారు. బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్లో ఆయనను అడిగిన ఓ ప్రశ్నకు చాలా అభ్యంతరకరమైన సమాధానం చెప్పారు.

మీరు భారత్ను మిస్సవుతున్నారా అంటే..
మీరు ఇండియాను మిస్ అవుతున్నారా అని అడిగితే.. మిస్ అవడానికి ఏమీ లేదని చెప్పారు. తన సమీప బంధువులు ఇంగ్లాండులో, అమెరికాలో ఉన్నారని చెప్పారు. ఇండియాలో ఎవరూ లేరని, కొంచెం దూరపు బంధువుల గురించి చూస్తే, వాళ్లంతా బ్రిటీష్ పౌరులు అని, అందువల్ల కుటుంబపరంగా కోల్పోయేదేమీ లేదన్నారు.
Recommended Video


భారత దేశ కోర్టులపై..
కోర్టుల్లో విచారణపై మాట్లాడుతూ.. తన కోసం వేట కొంతకాలం జరుగుతోందని వ్యాఖ్యానించారు. అందువల్ల తాను ఏదో మానసిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నదేమీ లేదని, తాను కచ్చితంగా ఏ తప్పు చేయలేదన్నారు. నిజానికి అంతిమంగా బ్రిటన్ కోర్టులో విచారణ జరుగుతుండటం తనకు సంతోషంగా ఉందని, ఇది నిష్పాక్షికమైన కోర్టు అని, చూద్దాం ఏం జరుగుతుందో అన్నారు.

1992 నుంచి బ్రిటన్లో మాల్యా
విజయ్ మాల్యా 1992 నుంచి బ్రిటన్లో ఉంటున్నాడు. దీనిని తన రెండో నివాసంగా భావిస్తున్నాడు. మాల్యాను లండన్ నుంచి భారత దేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications