VIRAL:రైల్వేస్టేషన్లో కుళాయి ప్రెషర్, రైలు బోగీల్లోకి ప్రెషర్.. వైరల్
ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. అవును ఏదీ ఆగడం లేదు. ఇక విషయానికి వస్తే ఓ రైల్వే ప్లాట్ పామ్పై నల్లా చిమ్ముతుంది. అయితే అదీ పక్కనే రైలు వెళుతుంది. వెళ్లే వారిపై కూడా ఆ వాటర్ చిమ్మింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ట్రోల్ అవుతుంది. మీరు కూడా ఆ వీడియోను చూడండి.
ట్విట్టర్ యూజర్ అభయ్ ఆ వీడియోను షేర్ చేశారు. ఆ నల్లా నుంచి వస్తోన్న నీరు.. వెళుతున్న రైలుపై పడింది. బోగీలల ఉన్న జనాలపై నీరు పడింది. ఇంకేముంది అంతా అరుపులతో ఆ వీడియో నిండింది. ఆ వీడియోకు ఇండియన్ రైల్వేస్ ఎట్ యూఆర్ సర్వీస్ అని క్యాప్షన్ పెట్టారు. ఆ వీడియో ఇప్పటికే 1.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 26 వేల లైకులు కొట్టారు.
వీడియో 30 సెకన్ల నిడివి ఉంది. రైలు వెళుతుండగా.. కొందరు ప్రయాణికుల మీద నీరు పడింది.ఆ వీడియోకు కామెంట్ల వరద పారుతుంది. ఇండియన్ రైల్వే స్పెషల్ సర్వీస్ ప్రొవైడ్ చేసిందని రాశారు. కొందరు స్నానం చేయలేదని రైల్వేస్ కూడా తెలిసిందని మరొకరు సరదాగా రాశారు. అదీ ఆటో క్లీనింగ్ సిస్టమ్ అని మరొకరు రాశారు.
Indian railways at your service 😂 pic.twitter.com/fEL65NFjHs
— Abhy (@craziestlazy) October 26, 2022
అదీ ఏ1 ఎనేబుల్ చేయబడిందని.. దాహంతో ఉన్న ప్రయాణికులను గుర్తిస్తోందని రాశారు. కిటికీ ద్వారా నేరుగా నీటిని అందుబాటులో ఉంచుతందని పేర్కొన్నారు. దీనికి స్పర్శ అంటూ ఉండదని.. ఒకరు రాశారు. రైళ్ల కోసం ఆటో క్లీనింగ్ సేవలు అని మరొకరు రాశారు.