Viral:పుణెలో వరద నీటి బీభత్సం.. మోకాలి లోతు వరకు నీరు
ఈ ఏట భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే స్మార్ట్ సిటీలలో కూడా నీరు నిలచిపోతుంది. దీంతో ఇదేం స్మార్ట్ సిటీ అని అంటున్నారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. దానిని మీరు కూడా చూడండి.
పుణెలో వరద ప్రవాహం కొనసాగుతోంది. అక్కడ గల పెర్గుసన్ కాలేజీ వద్ద నీరు భారీగా చేరింది. మోకాలి లోతులో నీరు ఉంది. వరద నీరు వల్ల దోమలు ఉంటాయి. పుణెలో గల ములా ముత్తా రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు రద్దు చేయాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడే కాదు.. ఇదివరకు కూడా రిక్వెస్ట్ చేశారు.

అయినప్పటికీ ప్రయోజనం లేదు. ఆ ప్రాజెక్టుపై మాత్రం వెనకడుగు వేయలేదు. పుణెలో స్మార్ట్ సిటీ అని చెబుతోన్న.. నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీనికి సంబంధించి నివారణ చర్యలు తీసుకోవడం లేదు. పేరుకే స్మార్ట్ సిటీ.. కానీ కనీస సౌకర్యాలు లేవు. వరద నీరు మోకాలు లోతు వరకు వచ్చిన తీయడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సారి వర్ష బీభత్సం కొనసాగింది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ఎన్నడు లేనంతగా జల ప్రళయం వచ్చినట్టు అయ్యింది. ఇప్పటికీ కూడా వర్షాలు పడుతున్నాయి.












Click it and Unblock the Notifications