హిందువులను ఎండబెట్టి ముస్లింలకు మంచి నీళ్లు
Delhi water cricis: దేశ రాజధానిలో నీటి సంక్షోభానికి తెరపడట్లేదు. రోజులు గడుస్తున్నా ట్యాంకర్లే గతి అయ్యాయి. గొంతు తడుపు కోవడానికి చుక్క నీటి కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. పాని పట్టు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్యాంకర్ రాగానే ఢిల్లీవాసులు బిందెలు, బకెట్లు, పైపులతో దాని మీదికి ఎగబడటం సర్వసాధారణం అయిందక్కడ.ఢిల్లీ జనాభా 3 కోట్ల 20 లక్షలు పైమాటే. ఢిల్లీ మంచినీటి అవసరాలు రోజూ మూడున్నర మిలియన్ లీటర్లు అవసరమౌతాయి. ఢిల్లీకి ప్రధాన నీటి వనరులు అక్కడి నదులే. గంగానది- 470, యమున- 755, భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్ నుంచి 495 క్యూసెక్కుల మేర నీటీని తరలిస్తారు.
గత ఏడాది నెలకొన్న వర్షభావ పరిస్థితుల ఈ మూడు నదుల్లో డెడ్ స్టోరేజీ ఏర్పడింది. రోజువారీ అవసరాలకు అనుగుణంగా నీళ్లు అందట్లేదు. ఈ ఏడాది వేసవి ఆరంభం నుంచే నీటి ఎద్దడి నెలకొంది. దీన్ని అధిగమించడానికి ఢిల్లీ జల్ బోర్డు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. నీటి కొరత నెలకొంది. మంచినీటి కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.ఈ సమస్య కాస్తా రాజకీయ రంగు పులుముకొంది. రెండు దఫాలుగా భారీ మెజారిటీతో ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి ముందు చూపు లేదంటూ అటు కాంగ్రెస్, ఇటు భారతీయ జనతా పార్టీ దుమ్మెత్తి పోస్తోన్నాయి. రోడ్ల మీదికి వచ్చాయి. మట్కా ఫోడ్.. ఆందోళనలను చేపట్టాయి. ఖాళీ కుండలతో ఢిల్లీ జల్ బోర్డ్ కార్యాలయంపై రోజూ దాడులు సాగిస్తోన్నాయి.

ఈ పరిస్థితుల మధ్య బీజేపీ మరో అడుగు ముందుకేసింది. మతాన్ని తీసుకొచ్చింది. హిందు, ముస్లిం అంటూ నీటి ఎద్దడి బాధితులను విడగొట్టింది. ఉన్న అరకొర నీటిని సరఫరా చేయడం, ట్యాంకర్లను తరలించడంలో హిందువులపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందంటూ బీజేపీ ఆరోపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.హిందువులు నివసించే ప్రాంతాలకు మంచినీటిని నిలిపివేసి ముస్లింలు ఉండే ప్రదేశాలకు ఢిల్లీ ప్రభుత్వం తరలిస్తోందంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు కపిల్ మిశ్రా ఆరోపించారు. హిందువులు అధికంగా నివసించే యమునా విహార్, మౌజ్పూర్, గోకుల్పురిల నుంచి మంచినీటిని ముస్లింల ప్రాబల్యం ఉండే సీలంపూర్, జఫ్రాబాద్, సీమాపురీలకు పంపిస్తోందంటూ ఆయన ఆరోపించారు.
ఐపీ ఎక్స్టెన్షన్ నుంచి నీటిని అల్లా కాలనీకి తరలిస్తోందంటూ విమర్శించారు. రాజేంద్రనగర్, కరోల్ బాగ్, ఆనంద్ పర్వత్ ప్రాంతాలకు దక్కాల్సిన మంచినీటిని జామా మసీద్, మతియా మహల్ వంటి ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు తీసుకెళ్తోన్నారంటూ ధ్వజమెత్తారు కపిల్ మిశ్రా. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.
-
ఎండాకాలం చన్నీళ్ళ స్నానం చేస్తున్నారా? -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications