వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ఉన్నా పోటెత్తిన ఓటర్లు -బెంగాల్ 7వదశలోనూ భారీ పోలింగ్ -మధ్యాహ్నానికే 55% దాటి -ఈసీ అనూహ్యం

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి రెండో దశ విలయం కొనసాగుతున్నా ప్రజాస్వామిక పండుగ యథావిథిగా కొనసాగుతున్నది. పశ్చిమ బెంగాల్ లో వైరస్ వ్యాప్తి తారా స్థాయికి చేరినా, అసెంబ్లీ ఎన్నికల ఏడో దశలోనూ పోలింగ్ భారీగానే నమోదవుతోంది. నేడు 34 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతున్నది. ఎన్నికల సంఘం అధికారిక లెక్కల ప్రకారం సోమవారం 1గంట సమయానికే 55.12శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల్లోపు ఇది ఈజీగా 70శాతానికిపైగా వెళ్లొచ్చనే అంచనాలున్నాయి.

Recommended Video

TN Assembly Elections : Celebrities Voting సోషల్ మీడియాలో వైరల్ | Rajinikanth, Ajith, Vijay

జగన్.. ఒళ్లు జాగ్రత్త, జస్టిస్ రమణ వచ్చారు -బెయిల్ రద్దు భయంతో రాయబారాలు ఎంపీ రఘురామ తాజా బాంబుజగన్.. ఒళ్లు జాగ్రత్త, జస్టిస్ రమణ వచ్చారు -బెయిల్ రద్దు భయంతో రాయబారాలు ఎంపీ రఘురామ తాజా బాంబు

చెదురుమొదురు ఘ‌ట‌న‌లు మిన‌హా ప‌శ్చిమ‌బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ఏడో దశ పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్న‌ది. సీఎం మమత ఫొటో కలిగిన టోపీతో వచ్చిన టీఎంసీ ఎన్నికల ఏజెంట్ ను బీజేపీ అడ్డుకోవడం, మరోచోట బీజేపీ ఏంజెంటును మిగతా పార్టీలవాళ్లంతా కలిసి వెళ్లగొట్టడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

West Bengal Elections 2021: 55.12% polling recorded till 2.45 pm, EC transfers more police officers

పోల్ షెడ్యూల్ విడుదలైన రెండోరోజే బెంగాల్ డీజీపీని మార్చేసిన ఎన్నికల సంఘం చివరి దశలోనూ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. సోమవారం ఏడో దశ పోలింగ్ పూర్తయితే, చివరిదైన 8వ దశకు ఈనెల 29న పోలింగ్ జరుగనుంది. చివరి దశ పోలింగ్ జరుగనున్న జిల్లాల్లో డీఐజీ స్థాయి నుంచి కానిస్టేబుల్ దాకా పదుల సంఖ్యలో పోలీసులను ఈసీ బదిలీ చేసింది.

 oxygen కొరత: Amazon భారీ సాయం -10వేల కాన్సంట్రేటర్లు ఎయిర్ లిఫ్ట్, భారత్‌లోని ఆస్పత్రులకు డెలివరీ oxygen కొరత: Amazon భారీ సాయం -10వేల కాన్సంట్రేటర్లు ఎయిర్ లిఫ్ట్, భారత్‌లోని ఆస్పత్రులకు డెలివరీ

కరోనా నేపథ్యంలో షెడ్యూల్ కుదించి, ఒకేరోజు పోలింగ్ పెట్టాలన్న బీజేపీయేతర పార్టీల వినతిని ఈసీ తోసిపుచ్చడంతో బెంగాల్ ఎన్నికలు యథావిథిగా జరుగుతున్నాయి. మే 2న ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను వెలువడనున్నాయి. బెంగాల్ లో ఏడోదశ పోలింగ్ కు ఓటర్లు పోటెత్తిన సందర్భంలోనే అటు మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తికి, ప్రత్యేకించి తమిళనాడులో విపత్కర పరిస్థితికి ఎన్నికల కమిషనే కారణమని, ఇంత మంది చావులకు కారణమైన ఈసీపై హత్యానేరం కింద కేసుపెట్టాలంటూ మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

English summary
amid covid surge, Voter turnout climbed up to 55.12% at 1.30 pm from 37.72% at 11.30 am on Monday as Bengal voted for the penultimate time in the eight-phase election. The Election Commission transferred a few police officers as West Bengal voted in the seventh phase of assembly polls on Monday, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X