Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పంచాయితీ ఎన్నికల పంచాయితీలో 9 మంది హత్య, రాత్రికి ఏం జరుగుతుందో?

కోల్ కత్తా/పశ్చిమ బెంగాల్: ఎన్నికలు అంటేనే అన్ని పార్టీల నాయకులు వారి గెలుపుల కోసం దేనికైనా తెగిస్తారని తెలిసిన విషయమే. లోక్ సభ, శాసన సభ, జిల్లా పంచాయితీ, గ్రామ పంచాయితీ ఎన్నికలు ఇలా ఏ ఎన్నికలు అయినా సరే పలు పార్టీల కార్యకర్తలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం సర్వసాధారణం. ముఖ్యంగా గ్రామాల్లో జరిగే రాజకీయాలు ఎక్కడా జరగవు అని మరోసారి వెలుగు చూసింది.

పశ్చిమ బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధికారంలో ఉంది. తృణముల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరితో టచ్ లో ఉన్నారు.

West Bengal panchayat election riots, 9 activists of various parties brutally killed

శనివారం పశ్చిమ బెంగాల్ లో పంచాయితీ ఎన్నికల పోలింగ్ మొదలైయ్యింది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీతో పాటు కమ్యూనిస్టు పార్టీలు, బీజేపీ కూడా బలంగానే ఉంది. శనివారం ఉదయం ప్రశాంతంగా పంచాయితీ ఎన్నికలు మొదలు కావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే రానురాను పంచాయితీ ఎన్నికల పోలింగ్ ప్రతీకారాలకు దారితీసింది.

పంచాయితీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా మొదట టీఎంసీ కార్యకర్త హత్యకు గురైనాడు. తరువాత టీఎంసీ కార్యకర్తలు ఐదు మంది హత్యకు గురైనారు. పంచాయితీ ఎన్నికలు ప్రతీకార హత్యలకు దారితీశాయి. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలతో పాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి అనుచరుడు దారుణ హత్యకు గురైనారు.

పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా శనివారం మద్యాహ్నం వరకు 9 మంది పలు పార్టీల కార్యకర్తలు హత్యకు గురైనారు. ఇక సాయంత్రం ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు. పోలింగ్ పూర్తి అయిన తరువాత రాత్రి పూట గ్రామాల్లో ఏవైనా గొడవలు జరిగితే ఇంకా ఎంత మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో అంటూ పలు పార్టీల కార్యకర్తల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల సందర్బంగా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. పంచాయితీ ఎన్నికలకు కేంద్ర బలగాలు సహకరించలేదని, అందుకే మా పార్టీ కార్యకర్తలు హత్యకు గురి అవుతున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్ర బలగాలకు సహకరించలేదని, అక్కడి టీఎంసీ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడాలని సొంత పార్టీ కార్యకర్తలను పొట్టన పెట్టుకుంటున్నదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+