తిరుమలలో ‘సంప్రదాయ భోజనం’ ప్రత్యేకతలు ఏమిటి, మెనూలో ఏమేం ఉంటున్నాయి
తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఉచిత భోజన సదుపాయం ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీంతో పాటు టీటీడీ ఇప్పుడు కొత్తగా 'సంప్రదాయ భోజనాన్ని' భక్తులకు అందుబాటులోకి తెస్తోంది.
ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఈ సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చి పరిశీలిస్తున్నారు.
తొలి రోజు భోజనం చేసినవారి నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని, రెండో రోజు (27.08.2021) టీటీడీ ఈవో కూడా ఈ భోజనాన్ని ఆరగించారని తితిదే అధికారులు చెప్పారు.
- అన్నమయ్య: తిరుమల వెంకటేశ్వరస్వామికి తాళ్లపాక వంశస్థులే ఎందుకు కన్యాదానం చేస్తారు
- తిరుమలలో లాక్డౌన్ తరువాత దర్శనం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? - కొండ పైనుంచి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
ఇంతకీ ఏమిటీ సంప్రదాయ భోజనం
పూర్తిగా దేశీయ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన ఆహార ఉత్పత్తులతో వండిన భోజనాన్నిభక్తులకు అందించాలని టీటీడీ నిర్ణయించింది.
దీన్నే 'సంప్రదాయ భోజనం' అని పిలుస్తున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రస్తుతం ఇలాంటి భోజనాన్ని అందుబాటులో ఉంచుతున్నారు.
దేశీయ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన పంటలతో వండిన ఆహార పదార్థాలు తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, కోవిడ్ సమయంలో శాస్త్రవేత్తలు కూడా ఇమ్యూనిటీ పెంచే ఆహారం గురించి చర్చిస్తున్నారని తితిదే ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి చెప్పారు.
''పట్టణ వాసులతో పోల్చితే గ్రామాల్లో సహజ సిద్ధమైన, కల్తీ లేని ఆహారం తీసుకునే వారిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆహారం తీసుకోవాల్సి అవసరాన్ని చాటడం కోసం, గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి సంప్రదాయ భోజనాన్ని తిరుమలలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం'' అన్నారాయన.
లాభాపేక్ష లేకుండా శాశ్వత ప్రాతిపదికన దీన్ని అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
- టీటీడీ బడ్జెట్ రూ. 3,309 కోట్లు... త్వరలో 300 సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీ
- ఎడారి ఇసుక నేలలో పచ్చని పొలం... ఈ అద్భుతం ఎలా సాధ్యం?

'పూర్తిగా దేశీయ గో ఆధారిత ఉత్పత్తులతోనే'
గోవిందుడికి గో ఆధారిత నైవేద్యం సమర్పించాలని టీటీడీ బోర్డు గతంలో తీర్మానించి అమలు చేస్తోంది. అందులో భాగంగా దేశీయ గోవుల ఆధారంగా సేంద్రియంగా పండించిన బియ్యం, పప్పు దినుసులు, బెల్లం, దేశీయ ఆవు నెయ్యితోనే నైవేద్యం సమర్పిస్తున్నారు.
అదే రీతిలో భక్తులకు కూడా గోఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ సంప్రదాయ భోజనాన్ని తీసుకొస్తున్నట్లు తితిదే పీఆర్వో పి.రవి 'బీబీసీ'తో చెప్పారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''తితిదే ఆద్వర్యంలో పలమనేరులో సుమారు 450 ఎకరాల్లో దేశీ గోశాల ఉంది. సేంద్రియ ఎరువులు, పంచగవ్య వంటివన్నీ ఈ గోశాల నుంచి ఉత్పత్తవుతాయి. దీంతో పాటు చిత్తూరు జిల్లా రైతులలోనూ ఈ దిశగా అవగాహన కల్పించేందుకు కూడా తితిదే ప్రయత్నిస్తోంది'' అని చెప్పారు.
- సంకల్ప్ ఆర్ట్ విలేజ్: సేంద్రియ వ్యవసాయం, గ్రామీణ హస్త కళలతో ఓ గ్రామాన్ని సృష్టించిన యువతి
- మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
తొలి రెండు రోజుల్లో...
గురువారం నుంచి ఈ ట్రయల్ రన్ మొదలు కాగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలలో వివిధ రకాల ఆహార పదార్థాలు వడ్డించారు.
కాలా బాత్ ఉప్మా, కుల్లకారు బియ్యం ఇడ్లీ.. రెడ్ రైస్తో వంటకాలు చేశారు. కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాలతో వండిన పదార్థాలను వడ్డించారు. కొబ్బరి అన్నం, పులిహోర, పూర్ణాలు, పచ్చి పులుసు, దోశకాయ పప్పు వంటివి ఇప్పటికి 15 రకాలకు పైగా వంటకాలను భక్తులకు అందించారు.
భక్తుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని అధికారులు చెప్పారు.
ఈ ట్రయల్ రన్లో తితిదేతో పాటు పనిచేస్తున్న చిరుధాన్యాల ఆహార నిపుణుడు రాంబాబు మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టులో భాగంగా దేశీయ ఆవు నెయ్యి, గానుగ నూనె, సేంద్రియ చెరకు పంట నుంచి తయారుచేసిన బెల్లంతో వంటలు వండుతున్నట్లు చెప్పారు.
- తిరుమల డిక్లరేషన్ వివాదం: మక్కా మసీదు, వాటికన్ చర్చిలలోకి ఇతర మతస్తులు వెళ్లవచ్చా?
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
ఉచిత భోజనం ఉన్నప్పటికీ...
తిరుమలలో చాలాకాలంగా భక్తులకు ఉచితం భోజన సదుపాయం ఉంది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో నిత్యం పెద్ద ఎత్తున ఉచిత అన్నదానం జరుగుతుంది.
దీంతోపాటు 'సంప్రదాయ భోజనం' పేరుతో అన్నమయ్య భవనంలో అందుబాటులో తెచ్చేందుకు తితిదే కసరత్తు చేస్తోంది.
''వారం రోజుల ట్రయల్ రన్ తరువాత దీనిపై సమీక్షించుకుని బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. లాభాపేక్ష లేకుండా శాశ్వత ప్రాతిపదికన అమలు చేయడానికి విధివిధానాలు రూపకల్పన చేస్తారు'' అని పి.రవి చెప్పారు.
కాగా, అన్నమయ్య భవనంలో ఇంతకుముందు ప్రైవేట్ నిర్వహణలోని క్యాంటీన్ ఉండేది. ఆ కాంట్రాక్ట్ ముగియడంతో టీటీడీయే స్వయంగా ఇక్కడ భక్తులకు ఆహార శాల నిర్వహించాలనే ఆలోచన చేసింది. అందులో భాగంగానే సంప్రదాయ భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తిరుమల భక్తులకు ఎలాంటి కల్తీ లేని బలవర్థక ఆహారం అందుతుందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత 'వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)
-
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications