Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెళైన ఏడాదికే కర్నూలు అమ్మాయికి ఏం జరిగింది ?, మేడ మీద, మామ ఫ్యామిలీ కథ!

బెంగళూరు/కర్నూలు: యువతికి పెళ్లి వయసు రావడంతో ఆమె (lady) వివాహం చెయ్యడానికి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూశారు. పక్క రాష్ట్రంలో వ్యాపారం చేస్తున్న వ్యక్తి కుమారుడితో యువతి పెళ్లి జరిపిస్తే ఆమె సుఖంగా ఉంటుందని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఏడాది క్రితం వివాహం చేసుకున్న యువతి (lady) భర్త ఇంటి మేడ మీద నుంచి కిందపడి అనుమానాస్పదంగా శవమై కనిపించడం కలకలం రేపింది.

మేడపై నుంచి పడి గృహిణి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన కర్ణాటకలోని రాయచూరు నగరంలోని స్థానిక బద్రీనాథ్ కాలనీలో చోటుచేసుకుంది. వరకట్న వేధింపుల కారణంగానే వివాహిత మహిళ (lady) హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. శిల్పా (28) అనే గృహిణి మృతి చెందిందని పోలీసులు అన్నారు. శిల్పా (wife) భర్త శరత్, మామ సురేశ్, అత్తగారు శశికళ ఆమెను (lady) హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.

What happened to the Kurnool girl in Raichur a year after her marriage

రాయచూరు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ (AP) లోని కర్నూలు జిల్లాలోని ఆదోనికి చెందిన శిల్పాను రాయచూరు నగరంలోని బియ్యం వ్యాపారి సురేష్ కుమారుడు శరత్‌తో 2022 జూన్ నెలలో వివాహం జరిపించారు. వివాహం జరిగినప్పటి నుంచి శరత్ (husband), శిల్పా దంపతుల (lady) కాపురంలో కుటుంబ కలహాలు మొదలైనాయని, నిత్యం ఇద్దరూ గొడవలు పడుతున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

కొంతకాలం శిల్పా ఆమె ఊరికి వెళ్లిపోయింది. పెద్దలందరూ కలిసి శిల్పాను (husband) ఓదార్చారని, ఆమె భర్త శరత్ కు బుద్దిమాటలు చెప్పి తరువాత ఆమెను భర్త (husband) ఇంటికి పంపించారని తెలిసింది. అయితే ఉదయం శిల్పా ఆమె (lady) భర్త (husband) శరత్ ఇంటిలోని మేడ మీద నుంచి నేలపై పడి మృతి చెందింది. విషయం తెలుసుకున్న సమీపంలోని నేతాజీ నగర్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

విషయం తెలుసుకున్న శిల్పా (wife) కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ రాయచూరు వెళ్లారు. శిల్పా భర్త శరత్, మామ సురేష్ ను పట్టుకుని చితకబాదేశారు. పోలీసులు శిల్పా మామ సురేష్ ను రక్షించారు. శిల్పా (wife) అకస్మాత్తుగా మేడ మీద నుంచి కిందపడి చనిపోయిందని ఆమె (lady) భర్త కుటుంబ సభ్యులు అంటున్నారు. శిల్పాను మేడ మీద నుంచి కిందకు తోసేసి హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు భర్త శరత్ తండ్రి సురేష్, అతని కుటుంబ సభ్యులపై కేసు పెట్టారని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+