Delhi Polls: ఢిల్లీ ఎన్నికలకూ, ఐటీ పరిమితి పెంపుకూ లింక్ ?
ఇవాళ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ (union budget 2025)లో ఆదాయపు పన్ను (income tax) మినహాయింపు పరిమితిని ఏకంగా 12 లక్షలకు పెంచేశారు. దీంతో దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా వేతన జీవులకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయిందని సాయంత్రం ఆర్దికమంత్రి ప్రెస్ మీట్లో వెల్లడించారు. అయితే కేంద్రం తీసుకున్న ఈ భారీ నిర్ణయం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.
ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 12 లక్షలకు పెంచుతూ ఆర్థికమంత్రి తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న రెండు కారణాల్లో ఒకటి ఆర్ధిక మందగమనంతో సతమతం అవుతున్న దేశంలో మధ్యతరగతి ఖర్చుపెట్టే సామర్ధ్యాన్ని పెంచడం అయితే రెండవది ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, ఈ ఏడాది జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు. ఈ రెండు కారణాలతో ఐటీ పరిమితి పెరిగిందన్న విషయం బహిరంగ రహస్యమే.

అయితే ఇప్పటికిప్పుడు కారణాన్ని చూస్తే మాత్రం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారాయి. అధికార ఆప్ ను ఢీకొట్టి విజయం సాధించడం బీజేపీకి అంత సులువు కాదనేది ఇప్పటికే పలు సర్వేలు తేల్చేశాయి. ఇలాంటి పరిస్ధితుల్లో ఢిల్లీలో ప్రదాన ఓటు బ్యాంక్ అయిన మధ్యతరగతిని ఆకట్టుకునేందుకు ఏదో ఒకటి చేయాల్సిన పరిస్ధితి బీజేపీది. దీంతో ఆదాయపు పన్ను పరిమితిని అంతా ఊహించిన 10 లక్షలను మించి పోయి 12 లక్షలకు పెంచేసినట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మధ్యతరగతి, ప్రధానంగా ఉద్యోగులకు ఊరట దక్కింది. అయితే ఈ నిర్ణయం ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి ఏ మేరకు మధ్యతరగతి ఓట్లను కురిపిస్తుందో మరో వారం రోజుల్లో తేలిపోనుంది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications