పద్మావత్ అల్లర్లు: అసలేమిటీ శ్రీ రాజపూత్ కర్ణిసేన?
న్యూఢిల్లీ: పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా అల్లర్లకు, విధ్వంసానికి దిగడంతో శ్రీ రాజపూత్ కర్ణిసేన పేరు దేశప్రజలందరికీ తెలిసి వచ్చింది. అసలు ఈ సంస్థ స్వరూప స్వభావాలేమిటి, దానికి పుట్టుపూర్వోత్తరాలేమిటనే ప్రశ్నలు అందరి మెదళ్లలో పుడుతున్నాయి.
Recommended Video

శ్రీ రాజపుత్ కర్ణిసేన నాయకుడు 67 ఏళ్ల లోకేంద్ర సింగ్ కల్వీ పద్మావత్ సినిమాపై సమరం ప్రకటించారు. పద్మావత్ సినిమా గురించి ఆయన అన్న మాటలివి- "నేను నిన్న గాంధీ పుట్టిన చోటికి వెళ్లాను. బాపూ, నాకు బలాన్ని ఇవ్వు అని ప్రార్థించాను. దేశం నుంచి నువ్వు బ్రిటిష్ వాళ్లను వెళ్లగొట్టావు. నేను కేవలం పద్మావత్ సినిమాను తొలగించాలని అనుకుంటున్నా".

అది రాజపూత్ కుల సంస్థ
భారతదేశంలో శ్రీ రాజపూత్ కర్ణిసేన అనేది ఓ కుల సంఘం. పద్మావత్ సినిమాపై కన్నా ముందు పలు హింసాత్మక ఆందోళనలను అది నడిపింది. శ్రీ రాజపూత్ కర్ణిసేనకు 2005లో పునాదులు పడ్డాి. రాజస్థాన్ రాజపూత్ సామాజిక వర్గానికి చెందన నిరుద్యోగ యువత దాన్ని ఏర్పాటు చేరింది.

కల్వీ అండదండలతో ముందుకు..
అప్పటికే రాజపూత్ నాయకుడిగా ఆ సామాజికవర్గంలో గుర్తింపు ఉన్న లోకేంద్ర సింగ్ కల్వీ అండదండలతో అది ప్రాణం పోసుకుంది. కులాల ప్రాతిపదికన తమకు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కావాలని అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది.

ఆ తర్వాత వైఖరి మారింది...
రాజపూత్ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కులాల ప్రాతిపదికపై రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే, కర్ణిసేన ఆవిర్భావం తర్వాత వారి వైఖరి మారింది. కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలని వారు మాట్లాడుతూ వచ్చారు. ఇప్పటికి కూడా వారి వైఖరి అదే.

కర్ణిసేన విడిపోయింది...
అయితే, రాజకీయ నాయకులు సమీకరణాల కారణంగా శ్రీ రాజపూత్ కర్ణిసేన మూడు గ్రూపులుగా విడిపోయింది. ఒకటి శ్రీ రాజపూత్ కర్ణిసేన కాగా, రెండోది రాష్ట్రీయ రాజపూత్ కర్ణిసేన మితి, మూడోది శ్రీ రాష్ట్రీయ రాజపూత్ కర్ణిసేన. ప్రస్తుతానికి శ్రీ రాజపూత్ కర్ణిసేననే పెద్ద గ్రూప్.

జోథా అక్బర్పై కూడా ఆందోళన...
అశుతోష్ గోవరికర్ తసన జోథా అక్బర్ బాలీవుడ్ సినిమాను అడ్డుకోవడం ద్వారా 2006లో మొదటిసారి దేశవ్యాప్తంగా కర్ణిసేన పేరు వినిపించింది. ఇప్పుడు పద్మావత్ సినిమాపై సమరం ప్రకటించడం ద్వారా దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications