Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆదిపురుష్ సినిమాపై ఏమిటీ వివాదం... సీత డైలాగ్‌పై అభ్యంతరం ఎందుకు?

ఆదిపురుష్

'ఆదిపురుష్’ సినిమాలోని సీత పాత్రకు సంబంధించిన ఓ డైలాగ్ మీద నేపాల్‌లో వివాదం తలెత్తింది.

ఈ చిత్రంలో సీతను 'భారతదేశపు కుమార్తె'గా అభివర్ణించారు. దీనిపై నేపాల్ రాజధాని ఖాఠ్మండూ మేయర్ బాలేంద్ర షా అభ్యంతరం వ్యక్తం చేశారు.

చిత్ర నిర్మాతలు సినిమా నుంచి ఆ డైలాగ్‌ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

చిత్ర నిర్మాతలకు మూడు రోజుల సమయం ఇస్తున్నట్లు మేయర్ తెలిపారు. అంతేకాకుండా, ఇతర హిందీ చిత్రాలకు కూడా వార్నింగ్ ఇచ్చారు.

మరోవైపు సినిమాలోని అభ్యంతరకర సంభాషణలను నేపాల్ సెన్సార్ బోర్డ్ మ్యూట్ చేసిందని చిత్ర వర్గాలు బీబీసీకి తెలిపాయి.

సీత నేపాల్‌లోని జనక్‌పూర్‌లో జన్మించారని నేపాల్ వాదిస్తోంది. ఈ కారణంగానే ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్‌పై నేపాల్‌లో వివాదం నెలకొంది.

ఆదిపురుష్‌లోని సీతను భారత పుత్రికగా అభివర్ణించే డైలాగ్‌ను తొలగించేంత వరకు ఖాఠ్మండూ మెట్రోపాలిటన్ సిటీలో ఏ ఇతర హిందీ సినిమాను కూడా అనుమతించబోమని బాలేంద్ర షా హెచ్చరించారు.

ఆదిపురుష్

నేపాల్ సెన్సార్ బోర్డు ఏం చెప్పింది?

ఈ డైలాగ్‌పై నేపాల్ సెన్సార్ బోర్డు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది.

''బుధవారమే సినిమా చూశాం. డైలాగ్స్ కట్ చేసిన తర్వాతే ప్రదర్శనలకు అనుమతిస్తామని డిస్ట్రిబ్యూటర్లకు చెప్పాం'' అని బీబీసీతో నేపాల్ సెన్సార్ బోర్డు సభ్యుడు రిషిరాజ్ ఆచార్య తెలిపారు.

ఈ డైలాగ్ సినిమాలో బీప్ చేశారని కొందరు అంటుండగా నేపాల్‌లో ఈ పదాలను సినిమా నుంచి కత్తిరించినట్లు ఆచార్య చెప్పారు.

“కనీసం సినిమా కాపీల నుంచి ఆ తప్పు డైలాగ్‌ని తొలగించాలి. నేపాల్‌ కాపీలో మేం దానిని కత్తిరించాం." అని ఆయన అన్నారు.

నేపాల్‌లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ తప్పులతో సినిమాను ప్రదర్శించడాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు ఫిల్మ్ డెవలప్‌మెంట్ బోర్డ్ తెలిపింది.

"జానకి భారతదేశం కుమార్తె అనే డైలాగ్‌పై మేం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం'' అని బోర్డు ప్రెసిడెంట్ భువన్ కేసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేపాల్ స్వాతంత్య్రం, వారసత్వం, సరిహద్దులు మొదలైన సమస్యలపై లోపభూయిష్ట సన్నివేశాలు లేదా సంభాషణలను ప్రదర్శించే ప్రపంచంలోని ఏ చిత్రానికైనా ఫిల్మ్ డెవలప్‌మెంట్ బోర్డులు తన ముద్ర వేయడం ఆమోదయోగ్యం కాదని చెప్పారు.

ఈ నేపథ్యంలో సినిమాలోని వివాదాస్పద డైలాగ్‌ను తొలగించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను బోర్డు కోరింది.

ఆదిపురుష్

'సినిమా ఆడించవద్దని సూచించాం'

మేయర్ హెచ్చరిక తర్వాత సోషల్ మీడియాలో తనకు చాలా బెదిరింపులు వచ్చాయని నేపాల్ ఫిల్మ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ దుంగనా చెప్పారు.

"భద్రతా కారణాల దృష్ట్యా ఉదయం ఖాఠ్మండూలో సినిమాను ఆడించవద్దని సూచించాం" అని బీబీసీ నేపాలీ సర్వీస్‌తో భాస్కర్ అన్నారు.

అయితే, ఖాఠ్మండూ లోయతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో ప్రదర్శనలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కొనసాగాయని ఆయన పేర్కొన్నారు.

“వివాదాస్పద డైలాగ్‌ను తొలగించిన తర్వాత ఇకపై వాదించాల్సిన అవసరం కనిపించడం లేదు. సెన్సార్ బోర్డు ఇప్పటికే షోకు అనుమతి ఇచ్చింది’’ అని భాస్కర్ తెలిపారు.

గతంలో అక్షయ్‌కుమార్ చిత్రం 'చాందినీ చౌక్ టు చైనా'లో బుద్ధుడి గురించిన వివాదాస్పద డైలాగ్‌ను నేపాల్‌లో కట్ చేసి ప్రదర్శించారని ఆయన గుర్తుచేశారు.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+