కలాం మిషన్ డైరెక్టర్ కాకపోవడం వల్లే రాకెట్ కూలిపోయింది: అప్పటి ప్రధాని ఇందిర వ్యాఖ్య
చెన్నై: నెల్లూరులోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో ఓ ప్రయోగానికి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హాజరయ్యారు. ఆ ప్రయోగం విఫలమై రాకెట్ సముద్రంలో కూలిపోయింది. ఆ రాకెట్ మిషన్కు అబ్దుల్ కలాం డైరెక్టర్గా వ్యవహరించలేదని ఎవరో చెప్తే తెలుసుకున్న ఆమె తనతో మాట్లాడుతూ రాకెట్ కూలిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదని అన్నారట.
కలాంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పీటీఐ జర్నలిస్ట్ నిశాత్ అహ్మద్ చెప్పిన విషయమిది. ఇప్పుడు అంతరిక్ష కేంద్రంలో మీడియాపై ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆరోజుల్లో మీడియాపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో ప్రయోగ కేంద్రంలోని అన్ని ప్రాంతాలను చుట్టి వచ్చేవారమని పేర్కొన్నాడు.

అంతేకాదు శాస్త్రవేత్తలతో ఒకే గెస్ట్హౌస్లో ఉండేవాళ్లమని కూడా నిశాత్ వివరించారు. అగ్ని మిసైల్ను టెస్టింగ్ చేసే సందర్భంలో ఒడిషాలోని చాందీపుర్ బీచ్లో అబ్దుల్ కలాంతో చాటింగ్ చేశామని తెలిపాడు. ఆ రకంగా కలాంతో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన ఫేస్బుక్లో పోస్టు చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications