గిబ్లీ వాడకంలో ఇండియాలో ఆ రాష్ట్రమే టాప్..?
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా గిబ్లి స్టైల్ ట్రెండ్ నడుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ప్రధాని మోడీ, అపర కుభేరుడు ఎలాన్ మస్క్ సహా పలువురు ప్రముఖులు సైతం ఈ ఎఫెక్ట్ లో తమ ఫోటోలను మార్చుకుంటున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఏదైనా కానీ గిబ్లీ ఫోటోలు దర్శనం ఇస్తున్నాయి.
నచ్చిన ఫోటోలను కన్వర్ట్ చేసుకుని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలు యానిమేషన్ చిత్రాల మాదిరిగా ఉండటంతో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. గిబ్లీ లానే పలు ఎఫెక్ట్ లు ఉన్నప్పటికీ ప్రజెంట్ ఈ ఫోటోల ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. అలానే గిబ్లీ ఫోటోలు క్రియేట్ చేసుకునేందుకు పలు అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. ఛాట్ జీపీటీ, గ్రోక్ ద్వారా ఫ్రీగా క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. జీపీటీ ప్లస్, ప్రో సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారు ఎలాంటి పరిమితి లేకుండా ఫోటోలను మార్చుకునే అవకాశం అందిస్తుంది. సబ్ స్క్రిప్షన్ లేనివాళ్లు పరిమిత సంఖ్యలో ఫోటోలను కన్వర్ట్ చేసుకోవచ్చు.

అయితే ఇండియాలోనూ ఈ ఫీచర్ ను ఓ రేంజ్ లో ఉపయోగిస్తున్నారు. గిబ్లీని ఎక్కువగా ఉపయోగించే దేశాల్లో భారత్ టాప్ 5లో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గూగుల్ ట్రెండ్స్ డేటా ప్రకారం గత వారం రోజులుగా ఇండియాలో ఈ ఫీచర్ ను నెటిజన్లు పెద్ద మొత్తంలో వినియోగిస్తున్నట్లు తేలింది. మన దేశంలో ఈ ఫీచర్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్న రాష్ట్రం ఏది ? తక్కువగా ఉపయోగిస్తున్న రాష్ట్రం ఏది ? తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏ రేంజ్ లో దీన్ని ఉపయోగిస్తున్నారో తెలుసుకుందాం.
టాప్ లో ఏ రాష్ట్రం అంటే..?
ఇక గత వారం రోజులుగా గిబ్లీ ఫీచర్ ను అత్యధిక స్థాయిలో వినియోగించిన్న లిస్టులో మహారాష్ట్ర ఉంది. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో గుజరాత్, అస్సాం నిలిచాయి. అదే విధంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 74 శాతం, ఏపీలో 66 శాతం నెటిజన్లు ఈ ఫీచర్ ను ఉపయోగిస్తున్నట్లు తేలింది. మరోవైపు మిజోరాం, మణిపూర్, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, మేఘాలయ, పంజాబ్, బీహార్ రాష్ట్రాలు గిబ్లీ పట్ల తక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
-
క్లిక్స్ కోసం ఇంత నీచమా?: సోదరుడి కోసం రంగంలోకి స్టార్ హీరోయిన్! -
BREAKING: ఏపీలో సోషల్ మీడియా బ్యాన్- నిండు అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన -
"రేప్" చేస్తామంటూ రోజూ బెదిరిస్తున్నారు..! -
పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించినట్లు అసెంబ్లీ ప్రకటించిన సీఎం -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు












Click it and Unblock the Notifications