Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్ణాటకలో ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి ఈయనే! కానీ..

న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో వచ్చే వారంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ రాష్ట్ర ప్రజల నుంచి పలు అంశాలపై అభిప్రాయాలను సేకరించింది. అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై సేకరించిన అభిప్రాయాలను వెల్లడించింది. 2018లో ముగిసిన పదవీ కాలానికి కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్‌కు చెందిన సిద్ధరామయ్య ఇప్పటికీ ఆ పదవికి అత్యంత ప్రాధాన్యత గల అభ్యర్థి అని లోక్‌నీతి-సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (CSDS) భాగస్వామ్యంతో ఎన్డీటీవీ కొత్త అభిప్రాయ సేకరణ తేల్చింది.

అయితే, దీనికి ఒక మినహాయింపు ఉంది.. కేవలం నాలుగు శాతం మంది మాత్రమే తమ ఓటు ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. 40 శాతం మంది ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ఇష్టపడుతున్నారని సర్వేలో తేలింది. బసవరాజ్ బొమ్మైని మళ్లీ హాట్ సీట్‌లో చూడాలనుకుంటున్నారు 22 శాతం మంది. 15 శాతం మంది ప్రజలు హెచ్‌డి కుమారస్వామికి మద్దతిస్తున్నారని చెప్పారు. ఆయన సిద్ధరామయ్య తర్వాత, కేవలం ఒక సంవత్సరం మాత్రమే పదవిలో ఉన్నారు.

NDTV Public Opinion

అత్యున్నత పదవి కోసం రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కు మద్దతిచ్చే వారి సంఖ్య కేవలం 4 శాతం మంది. 2006లో హెచ్‌డి దేవెగౌడ జనతాదళ్ సెక్యులర్ నుంచి కాంగ్రెస్‌కి దిగుమతి అయిన సిద్ధరామయ్య.. 2010లో బళ్లారికి చేసిన పాదయాత్రతో బీజేపీలో భాగమైన మైనింగ్ బ్యారన్‌లు, రెడ్డి సోదరులను ఎదుర్కొంటూ పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు.

2013లో, వెనుకబడిన కులానికి చెందిన మొదటి తరం రాజకీయ నాయకుడు అత్యున్నత పదవిని పొంది, కాంగ్రెస్ విజయవంతమైన ముఖ్యమంత్రులలో ఒకరిగా ఎదిగారు సిద్దరామయ్య. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న యడ్యూరప్ప, ప్రస్తుతం ఉన్న బసవరాజ్ బొమ్మైపైనా కాంగ్రెస్ నేతలు అవినీతి ఆరోపణలు చేస్తోంది. అయితే, బొమ్మైనే సీఎం అభ్యర్థిగా బీజేపీ నిర్ణయించింది.

75 ఏళ్ల శ్రీ సిద్ధరామయ్య.. వృద్ధులలో బాగా ప్రాచుర్యం పొందారని సర్వేలో తేలింది. 56 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 44 శాతం మంది ప్రజలు సిద్దరామయ్యను ఇష్టపడుతున్నారు. 18-25 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 40 శాతం మంది మాత్రమే ఆయన్ను ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకున్నారు.

63 ఏళ్ల బొమ్మై పరిస్థితి రివర్స్‌గా ఉంది: వృద్ధుల సమూహంలోని 22 శాతం మందితో పోలిస్తే.. 18-25 ఏళ్లలోపు 28 శాతం మంది అతనిని తిరిగి కోరుకుంటున్నారు. అయితే మెజారిటీ ఓటర్లు నిర్దిష్ట అభ్యర్థులకు బదులుగా ఏ పార్టీకి ఓటు వేస్తారని సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 56 శాతం మంది తాము పార్టీ వైపు వెళతామని చెప్పగా.. 36 శాతం మంది అభ్యర్థిని పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని దృష్టిలో ఉంచుకుని ఓటు వేసే వారి శాతం మరింత కేవలం 4 శాతం ఉండటం గమనార్హం.

బీజేపీ కంటే కాంగ్రెస్‌ మద్దతుదారులు వ్యక్తిగత అభ్యర్థులకు బదులు పార్టీకి మద్దతు ఇస్తున్నారని సర్వేలో తేలింది. బీజేపీ మద్దతుదారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి - అభ్యర్థి ఎవరనే దానితో సంబంధం లేకుండా పార్టీకి ఓటు వేస్తామని 49 శాతం మంది చెప్పగా, అభ్యర్థి తమ ప్రాధాన్యత అని 47 శాతం మంది చెప్పారు. కాగా, మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజల మూడ్‌ను అంచనా వేయడానికి చేపట్టిన సర్వే కోసం 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 82 పోలింగ్ స్టేషన్‌లలో 2,143 మంది ఓటర్లను ఇంటర్వ్యూ చేశారు. ప్రజల అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+