నేను చెబుతున్నా, నరేంద్ర మోడీ అవినీతిపరుడు: రాఫెల్ డీల్పై రాహుల్ గాంధీ
Recommended Video

న్యూఢిల్లీ: రాఫెల్ స్కాం పైన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై గురువారం మరోసారి విమర్శలు కురిపించారు. రాఫెల్ స్కాంతో రూ.30 వేల కోట్లు అనిల్ అంబానీ జేబులో వేశారని తీవ్రంగా మండిపడ్డారు. రాఫెల్ డీల్లో రిలయన్స్కు భాగస్వామ్యం కేవలం ప్రతిఫలమేనని ఆరోపించారు.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇంత హఠాత్తుగా ఫ్రాన్స్ ఎందుకు వెళ్లవలసి వచ్చిందని ప్రశ్నించారు. ఇంతకు మించిన అవినీతి వ్యవహారం మరొకటి ఉండదని చెప్పారు. దేశానికి కాపలాదారుగా ఉంటానని చెప్పిన ప్రధాని మోడీ.. అనిల్ అంబానీకి ప్రధానిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

రాఫెల్ డీల్ రిలయెన్స్తో కుదుర్చుకోవాలని తమకు భారత ప్రధాని చెప్పారని గతంలో ఫ్రెంచ్ మాజీ ప్రధాని చెప్పారని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు సీనియర్ అధికారి కూడా అదే విషయం చెప్పాడని అన్నారు. కాబట్టి ఇందులో పూర్తిగా అవినీతి జరిగిందని తేలిపోయిందని అన్నారు.
నిర్మలా సీతారామన్ సడన్గా ఫ్రాన్స్కు వెళ్లి, రాఫెల్ ప్లాంట్కు వెళ్లవలసిన అవసరం ఏమి వచ్చిందని నిలదీశారు. అంత త్వరగా వెళ్లవలసిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. నేను ఈ దేశంలోని యువతకు స్పష్టంగా చెప్పదలుచుకున్నానని, ప్రధాని నరేంద్ర మోడీ అవినీతిపరుడు అని తీవ్ర ఆరోపణలు చేశారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications