వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కష్టాలు తీరుస్తామని చెప్పి.. వితంతువుపై గ్యాంగ్‌రేప్ చేశారు

|
Google Oneindia TeluguNews

ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కష్టాలు తీరుస్తారని వచ్చిన ఓ వితంతువుపై స్వామిజీ తోపాటు మరోవ్యక్తి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్ కు చెందిన మహిళకు ఇటీవల భర్త చనిపోయాడు. దీంతో ఆమె తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోంది.

తనకు తెలిసిన ఓ స్వామిని కలిస్తే కష్టాలు తొలగిపోతాయని ఓ వ్యక్తి సదరు మహిళతో నమ్మ బలికాడు. దీంతో ఆమె, తన కుమారుడితో కలిసి మధురకు వెళ్లింది. తన కష్టాలు తొలగించాలని ఆమె స్వామిజీని వేడుకుంది.

Widow alleges gang-rape by occultist, friend

ఈ క్రమంలో మొదట ఆమెపై స్వామిజీ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను ఇక్కడికి తీసుకొచ్చిన వ్యక్తి కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు వెళ్లడిస్తే ఆమె కుమారుడిని చంపేస్తామంటూ ఆమెను బెదిరించారు.

కాగా, వారివద్ద నుంచి ఎలాగోలా బయటపడ్డ బాధిత మహిళ, పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

English summary
A widow has alleged that she was gang-raped by an occultist and his friend in Mathura.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X