Wife: బాత్ రూమ్ లో మొగుడు, టవల్ త్వరగా ఇవ్వలేదని ఆంటీని చంపేశాడు, చూసి తట్టుకోలేకపోయాడు !
భోపాల్/ మధ్యప్రదేశ్: వివాహం జరిగిన తరువాత దంపతుల మద్య చిన్నచిన్న గొడవలు జరిగేవి. కూతురు పుట్టిన తరువాత గొడవలు కొంచెం పెద్దవి అయ్యాయి. దంపతులకు బంధువర్గం ఎక్కువ కావడంతో ఎవరో ఒకరి వచ్చి దంపతులను రాజీ చేసేవారు. కూతురు పెళ్లి వయసుకు వచ్చింది. పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. ఉదయం భర్త స్నానం చెయ్యడానికి బాత్ రూమ్ లోకి వెళ్లాడు. స్నానం పూర్తి చేసిన భర్త టవల్ ఇవ్వాలని భార్యకు చెప్పాడు. తాను వంటగదిలో ఉన్నానని, టవల్ నువ్వే తీసుకోవాలని భార్య చెప్పింది. కొంతసేపు భార్యను టవల్ అడుగుతూనే ఉన్నాడు. అయితే ఆమె వంట గదిలో పని మధ్యలో నిలిపిరాలేకపోయింది. స్నానం చేసిన భర్త అతని శరీరం అతను చూసి తట్టుకోలేకపోయాడో ఏమో? ఆవేశంగా బాత్ రూమ్ లో నుంచి బయటకు వచ్చాడు. తరువాత భార్యతో గొడవ పెట్టుకుని నానా రచ్చ చేశాడు. చివరికి ఇంటి బయట ఉన్న గడ్డపార తీసుకున్న భర్త భార్య తల మీద చితకబాది ఆమెను కూతురి కళ్ల ముందే చంపేయడం కలకలం రేపింది. బాత్ రూమ్ లోకి భార్య టవల్ త్వరగా తీసుకురాలేదని ఆమెను భర్త చంపేయడం కలకలం రేపింది.
Illegal affair: భర్తకు బాయ్ బాయ్, ప్రియుడికి హాయ్, విడాకులు తీసుకుని ప్రియుడి చేతిలో ఫినిష్!
25 ఏళ్ల క్రితం !
మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లాలోని హీరాపూర్ గ్రామంలో రాజ్ కుమార్ (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 25 సంవత్సరాల క్రితం పుష్పాబాయ్ (47) అనే మహిళను రాజ్ కుమార్ వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన తరువాత రాజ్ కుమార్, పుష్పా బాయ్ దంపతుల మద్య చిన్నచిన్న గొడవలు జరిగేవి.
పెళ్లి వయసుకు వచ్చిన కూతురు
కూతురు పుట్టిన తరువాత రాజ్ కుమార్, పుష్పా బాయ్ దంపతుల మద్య గొడవలు ఇంకా కొంచెం పెద్దవి అయ్యాయి. రాజ్ కుమార్, పుష్పా బాయ్ దంపతులకు బంధువర్గం ఎక్కువ కావడంతో ఎవరో ఒకరి వచ్చి దంపతులను రాజీ చేసేవారు. రాజ్ కుమార్ కూతురు పెళ్లి వయసుకు వచ్చింది. రాజ్ కుమార్, పుష్పా బాయ్ దంపతుల కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా రాజ్ కుమార్, పుష్పా బాయ్ దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి.
బాత్ రూమ్ లో స్నానం చెయ్యడానికి వెళ్లిన భర్త
ఉదయం రాజ్ కుమార్ స్నానం చెయ్యడానికి బాత్ రూమ్ లోకి వెళ్లాడు. స్నానం పూర్తి చేసిన రాజ్ కుమార్ టవల్ ఇవ్వాలని అతని భార్య పుష్పా బాయ్ కి చెప్పాడు. తాను వంటగదిలో పాత్రలు శుభ్రం చేస్తున్నానని, చేతికి సబ్బు అంటుకుని ఉందని, టవల్ నువ్వే తీసుకోవాలని పుష్పా బాయ్ ఆమె భర్త రాజ్ కుమార్ కు చెప్పింది.
వాడి శరీరం వాడే చూసుకోలేకపోయాడు
కొంతసేపు పుష్పాను ఆమె భర్త రాజ్ కుమార్ టవల్ తీసుకురావాలని అడుగుతూనే ఉన్నాడు. అయితే పుష్పా బాయ్ వంట గదిలో పని మధ్యలో నిలిపిరాలేకపోయింది. స్నానం చేసిన రాజ్ కుమార్ నగ్నంగా ఉన్న అతని శరీరం అతను చూసి తట్టుకోలేకపోయాడో ఏమో? ఆవేశంగా బాత్ రూమ్ లో నుంచి బయటకు వచ్చాడు. తరువాత భార్య పుష్పాతో గొడవ పెట్టుకున్న రాజ్ కుమార్ నానా రచ్చ చేశాడు.
కూతురి ముందే భార్యను చంపేశాడు
పుష్పా బాయ్ తో పెద్దగా గొడవ పెట్టుకున్న రాజ్ కుమార్ సహనం కోల్పోయి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఇంటి బయట ఉన్న గడ్డపార తీసుకున్న రాజ్ కుమార్ నేరుగా వెళ్లి అతని భార్య పుష్పా తల మీద చితకబాదేశాడు. ఆ సమయంలో కూతురు రాజ్ కుమార్ ను పక్కకు నెట్టేసింది. కిందపడిపోయిన రాజ్ కుమార్ మళ్లీ పైకి లేచి అదే గడ్డపారతో కూతురి కళ్ల ముందే అతని భార్య పుష్పా బాయ్ ను స్పాట్ లోనే చంపేయడం కలకలం రేపింది.
పోలీసులకు సాక్షం చెప్పిన కూతురు
బాత్ రూమ్ లోకి టవల్ త్వరగా తీసుకురాలేదని పుష్పా బాయ్ ను ఆమె భర్త రాజ్ కుమార్ దారుణంగా చంపేయడం మధ్యప్రదేశ్ లో కలకలం రేపింది. భార్యను హత్య చేసిన రాజ్ కుమార్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తన తల్లి పుష్పా బాయ్ ను తన తండ్రి రాజ్ కుమార్ చంపేశాడని అతని కూతురు సాక్షం చెప్పిందని పోలీసులు అన్నారు.