Wife: నేపాల్ ఆంటీ మీద భర్తకు అనుమానం, ఐటీ హబ్ లో తేడా వచ్చిందని, నమ్మించి చంపేసిన కేటుగాడు !
బెంగళూరు: నేపాల్ లో వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం కొడుకుతో పాటు దంపతులు ఐటీ హబ్ చేరుకున్నారు. ఇద్దరు కూతుర్లు నేపాల్ లోనే ఉంటున్నారు. ఐటీ హబ్ లో కాపురం పెట్టిన తరువాత భార్య తీరులో మార్పులు వచ్చాయని భర్తకు అనుమానం మొదలైయ్యింది. ఇదే సమయంలో భార్య వేరే వ్యక్తితో చనువుగా ఉంటున్న విషయం భర్త గమనించాడు. ఎర్రగా, బుర్రగా ఉన్న తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో జల్సా చేస్తోందని భర్తకు తెలిసింది. ఇదే సమయంలో భార్య ఆమె భర్తతో దూరం దూరంగా ఉండటం మొదలు పెట్టింది. అక్రమ సంబంధం కారణంగా తన భార్య తనను దూరం పెట్టి తనకు అన్యాయం చేస్తోందని భర్త రగిలిపోయాడు. భార్యతో విడిపోయిన భర్త వేరుగా నివాసం ఉంటున్నాడు. కొడుకుతో పాటు తల్లి వేరుగా ఉంటోంది. మూడు సంవత్సరాల తరువాత భార్యకు ఫోన్ చేసిన భర్త నేను మారిపోయానని, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని మాయమాటలు చెప్పాడు. భర్త మారిపోయాడని అనుకున్న భార్య తన ఇంటికి రావాలని భర్తకు చెప్పింది. భార్య ఇంటికి వెళ్లిన భర్త రెండు రోజులు బుద్దిమంతుడిలా ఉన్నట్లు నటించి మరుసటి రోజు భార్యను దారుణంగా చంపేయడం కలకలం రేపింది.

ఇద్దరు కూతుర్లు
నేపాల్ కు చెందిన తేజ్ బహుదూర్ 20 ఏళ్ల క్రితం కమలాదేవి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తేజ్ బహుదూర్, కమలాదేవి దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. 14 సంవత్సరాల పాటు దంపతులు ముగ్గురు బిడ్డలతో కలిసి నేపాల్ లోనే ఉన్నారు.

ఉద్యోగంలో చేరిన భర్త
ఆరు సంవత్సరాల క్రితం కొడుకుతో పాటు తేజ్ బహుదూర్, కమలాదేవి దంపతులు ఐటీ హబ్ బెంగళూరు చేరుకున్నారు. ఇద్దరు కూతుర్లు నేపాల్ లోనే ఉంటున్నారు. బెంగళూరులోని జేపీ నగర్ లోని ఓ ఫామ్ హౌస్ లో తేజ్ బహుదూర్ ఉద్యోగంలో చేరాడు. రెండు సంవత్సరాల పాటు భార్య కమలాదేవితో పాటు తేజ్ బహుదూర్ సంతోషంగానే ఉన్నాడు.

భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానం
కమలాదేవి కూడా ఉద్యోగంలో చేరింది. ఐటీ హబ్ బెంగళూరులో కాపురం పెట్టిన తరువాత తన భార్య కమలాదేవి తీరులో మార్పులు వచ్చాయని తేజ్ బహుదూర్ కు అనుమానం మొదలైయ్యింది. ఇదే సమయంలో భార్య కమలాదేవి వేరే వ్యక్తితో చనువుగా ఉంటున్న విషయం ఆమె భర్త తేజ్ బహుదూర్ గమనించాడు.

భార్యతో విడిపోయిన భర్త
తన భార్య కమలాదేవి ఎర్రగా, బుర్రగా ఉందని, అందుకే వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో జల్సా చేస్తోందని భర్త తేజ్ బహుదూర్ రగిలిపోయాడు. ఇదే సమయంలో కమలాదేవి ఆమె భర్త తేజ్ బహుదూర్ తో దూరం దూరంగా ఉండటం మొదలు పెట్టింది. అక్రమ సంబంధం కారణంగా తన భార్య కమలాదేవి తనను దూరం పెట్టి తనకు అన్యాయం చేస్తోందని తేజ్ బహుదూర్ రగిలిపోయాడు. మూడు సంవత్సరాల క్రితం భార్య కమలాదేవితో విడిపోయిన తేజ్ దీప్ జేపీ నగర్ లో వేరుగా నివాసం ఉంటున్నాడు.

మూడు సంవత్సరాల తరువాత భార్యకు ఫోన్ చేసి ?
కమలాదేవి ఆమె కొడుకుతో కలిసి రామమూర్తి నగర్ సమీపంలోని చెన్నసంద్రలో నివాసం ఉంటున్నది. కమలాదేవి కుమారుడు ఉద్యోగం చేస్తున్నాడు. మూడు సంవత్సరాల తరువాత భార్య కమలాదేవికి ఫోన్ చేసిన తేజ్ బహుదూర్ నేను మారిపోయానని, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని మాయమాటలు చెప్పాడు.

నమ్మించి దారుణంగా చంపేశాడు
భర్త తేజ్ బహుదూర్ మారిపోయాడని అనుకున్న భార్య కమలాదేవి చెన్నసంద్రలోని తన ఇంటికి రావాలని భర్తకు చెప్పింది. భార్య కమలాదేవి ఇంటికి వెళ్లిన భర్త రెండు రోజులు బుద్దిమంతుడిలా ఉన్నట్లు నటించాడు. కొడుకు ఉద్యోగానికి వెళ్లిన తరువాత కమలాదేవి ఎవరితోనో గంటకు పైగా ఫోన్ లో మాట్లాడుతోంది. ఆ సమయంలో ఇంకా రగిలిపోయిన తేజ్ బహుదూర్ కత్తి తీసుకున్న తేజ్ బహుదూర్ అతని భార్య కమలాదేవిని దారుణంగా చంపేయడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications