Wife: దంపతులకు జస్ట్ ఐదు మంది పిల్లలు. రాత్రి భర్తను సింపుల్ గా చంపేసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ?
త్రిపుర/అసోం: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతుల అన్యోన్య జీవితానికి సాక్షంగా ఐదు మంది పిల్లలు ఉన్నారు. రాత్రి భర్త ఇంటికి వెళ్లాడు. తరువాత దంపతుల మద్య గొడవ జరిగింది. దంపతుల మద్య గొడవ జరిన విషయం చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారికి తెలిసినా వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. మరుసటి రోజు ఉదయం భర్త శవమై కనిపించాడు. ఐదు మంది బిడ్డలతో కలిసి భార్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా భర్తను నేను చంపేశాను, ఇంట్లో శవం ఉంది తెచ్చుకోండి అని చెప్పడంతో పోలీసులు హడలిపోయారు.
Lady teacher: ఇంట్లో మొగుడు, స్కూల్ లో ప్రియులు, పాత ప్రియుడి చేతిలో కొడుకు !
పెళ్లి సెట్ చేసిన పెద్దలు
అసోంలోని త్రిపుర జిల్లాలోని సౌత్ నైచారి సమీపంలోని గోవింద షారా ప్రాంతంలో రాజ్ బాహు (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం పెద్దలు కుదిర్చిన బిస్వా మాలా అలియాస్ బిస్వా (37) అనే మహిళను రాజ్ బాహు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రాజ్ బాహు, బిస్వా మాలా దంపతులు సంతోషంగా కాపురం చేశారు.
ఐదు మంది పిల్లలు
రాజ్ బాహూ, బిస్వా మాలా దంపతుల అన్యోన్య జీవితానికి సాక్షంగా ఐదు మంది పిల్లలు ఉన్నారు. పిల్లలతో కలిసి రాజ్ బాహూ, బిస్వా మాలా దంపతులు హ్యాపీగా ఉండేవారు. అయితే రానురాను రాజ్ బాహూ, బిస్వా మాలా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. రాజ్ బాహూ, బిస్వా మాలా దంపతులు ఎందుకు గొడవపడుతున్నారని బంధువులు ఆరా తీశారు.
భర్తను స్పాట్ లో చంపేసిన భర్త
రాజ్ బాహూ, బిస్వా మాలా దంపతులకు అందరూ బుద్దిమాటలు చెప్పారు. రాత్రి రాజ్ బాహు ఇంటికి వెళ్లాడు. తరువాత రాజ్ బాహు, బిస్వా మాలా దంపతుల మద్య గొడవ జరిగింది. రాజ్ బాహు, బిస్వా మాలా దంపతుల మద్య గొడవ జరిగిన విషయం చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారికి తెలిసినా వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. తరువాత సహనం కోల్పోయిన బిస్వా మాలా ఇనుప రాడ్, పెద్ద కర్ర తీసుకుని ఆమె భర్త రాజ్ బాహును చితకబాది స్పాట్ లో చంపేసింది.
శవం ఇంట్లో ఉంది తెచ్చుకోండి సార్
మరుసటి రోజు రాజ్ బాహు ఇంట్లో శవమై కనిపించడంతో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న బంధువులు హడలిపోయారు. భర్త రాజ్ బాహును హత్య చేసిన బిస్వా మాలా ఐదు మంది పిల్లలను వెంటపెట్టుకుని నేరుగా బెలోనియా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. నా భర్త రాజ్ బాహును చంపేశాను, ఇంట్లోనే శవం ఉంది అని బిస్వా బాను పోలీసులకు చెప్పింది.
భర్తను చంపడానికి అదే కారణం ?
బిత్తరపోయిన పోలీసులు రాజ్ బాహు ఇంటికి పరుగు తీసి అతని శవాన్ని త్రిపుర జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రతిరోజు మద్యం సేవించి ఇంటికి వస్తున్న రాజ్ బాహు అతని భార్య బిస్వా మాలాను టార్చర్ పెడుతున్నాడని, అందుకే ఆమె అతన్ని చంపేసి ఉంటుందని బంధువులు అంటున్నారని, కేసు విచారణలో ఉందని బెలోనియా పోలీస్ స్టేషన్ అధికారులు అంటున్నారు.