సిఎం కేజ్రీవాల్ హింట్: మూణ్నాళ్ల ముచ్చటేనా?
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తారనే ప్రచారం ముమ్మరమైంది. ఇది చివరి సెషన్లాగా కనిపిస్తోందని ఆయన శుక్రవారం శాసనసభలో అన్నారు. జన్ లోక్పాల్ బిల్లును అడ్డుకుంటే రాజీనామా చేస్తానని ఆయన ముందే హెచ్చరించారు. జన్ లోక్పాల్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెసు, బిజెపి సభ్యులు అడ్డుకున్నారు. బిల్లును ప్రతిపాదించడాన్ని వ్యతిరేకిస్తూ 42 మంది సభ్యులు ఓటు చేయగా, సమర్థిస్తూ 27 మంది సభ్యులు ఓటు చేశారు.
జన్ లోక్పాల్ బిల్లును ప్రతిపాదించకుండా కాంగ్రెసు, బిజెపి సభ్యులు అడ్డుకున్నారని కేజ్రీవాల్ విమర్శించారు. కేజ్రీవాల్ ప్రసంగాన్ని ప్రతిపక్షాల సభ్యులు అడ్డుకున్నారు. గత రెండు రోజులుగా శాసనసభలో జరుగుతున్న సంఘటనల పట్ల తాను తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిపారు.

ఆమ్ ఆద్మీ పార్టీ అత్యవసర సమావేశానికి కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. అతి ప్రధానమైన బిల్లును సభలో ప్రతిపాదించకుండా అడ్డుకున్నందుకు నిరసనగా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కేజ్రీవాల్ రాజీనామా చేస్తారనే వార్తలను కాదనలేమని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు యోగేంద్ర యాదవ్ కూడా చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యాలయానికి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. తాము వీధుల్లో పోరాటం చేస్తామని, ప్రభుత్వాన్ని రక్షించుకునే ఉద్దేశం ఏమీ లేదని, దేశాన్ని అవినీతి నుంచి కాపాడుతామని కేజ్రీవాల్ అన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications