అంగుళం భూమి కూడా వదులుకోం: ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే
పైకి బానే ఉన్నా.. లోన కుళ్లు, కుతంత్రంతో ఉంటుంది చైనా.. డ్రాగన్ వైఖరిని కనిపెట్టడం కష్టమే. ఇక భారత్ విషయానికి వస్తే మాత్రం మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. దానికి ఇండియన్ ఆర్మీ తగినరీతిలో సమాధానం చెబుతుంది. ఇటీవల లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే భారత ఆర్మీ నూతన చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. సైన్యం వైఖరిని స్పష్టం చేశారు.
ఇండో-చైనా సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా వదులుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. భారత్-చైనా సరిహద్దులో ఇప్పుడున్న స్థితిని మార్చడానికి ఏమాత్రం అంగీకరించబోమని కుండబద్దలు కొట్టారు. ఇదే తమ వైఖరి ఇదేనని స్పష్టంచేశారు. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే వెల్లడించారు.

చైనాతో సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించామని తెలిపారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించామని వివరించారు. ఇక, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆ రెండు దేశాల మధ్య జరుగుతుంది సంప్రదాయ యుద్ధమేనని అభిప్రాయపడ్డారు. భారత్ విషయానికొస్తే దేశీయంగా తయారైన ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఆర్టీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాకు గట్టి సందేశం ఇచ్చారు. ఎల్ఏసీ వద్ద పహారా కొనసాగుతుందని.. తమ భూమి ఇచ్చేందుకు సిద్దంగా లేమని స్పష్టంచేశారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications