ఆశారం బాపు రేప్ కేసులో సాక్షిని కాల్చి చంపారు
ముజఫర్నగర్: ఆశారాం బాపు అత్యాచారం కేసులో సాక్షిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆదివారం సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా 35 ఏళ్ల అఖిల్ గుప్తాను న్యూ మండీ పోలీసు స్టేషన్ పరిధిలోని జన్సత్ రోడ్డులో కాల్చి చంపారు. ఆశారాం సూరత్ అత్యాచారం కేసులో అతను సాక్షి.
ఇంటికి తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారని, వెంటనే ఆస్పత్రికి తరలించామని, అయితే, అప్పటికే అతను మరణించాడని వైద్యులు తేల్చారని పోలీసులు చెప్పారు. గుప్తా ఆశారాం బాపు వంట మనిషిగా, వ్యక్తిగత సహాయకుడిగా ఉంటూ వచ్చాడు.

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో ఆశారాం బాపు జైలులో ఉన్నాడు. తమపై ఆశారాం బాపు, అతని కుమారుడు నారాయణ సాయి అత్యాచారం చేశారని సూరత్కు చెందిన అక్కాచెల్లెళ్లు ఆరోపించారు. గుప్తా ఈ కేసులో సాక్షి. అతని వాంగ్మూలాన్ని గాంధీ నగర్ కోర్టులో రికార్డు చేశారు.
లైంగిక దాడి కేసులో నిందితుడైన ఆశారాం సాయి తనయుడు నారాయణ సాయిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గతంలో అరెస్టు చేశారు. గత 58 రోజులుగా అతను పరారీలో ఉన్న అతన్ని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. సూరత్లో లైంగిక దాడి కేసులో నారాయణ సాయి నిందితుడు. అరెస్టు చేసిన సమయంలో అతను టర్బన్ ధరించి ఉన్నాడు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications