ఇద్దరు కుమారుల గొంతు కోసి..తాను రైలు కింద తలపెట్టి!
భువనేశ్వర్: కుటుంబ కలహాలు ఓ మహిళను ఉన్మాదానికి ప్రేరేపించాయి. కుటుంబ కలహాలకు ఆర్థిక ఇబ్బందులు తోడు కావడంతో ఆమె విచక్షణ కోల్పోయారు. తన ఇద్దరు కుమారులను గొంతు కోసి హత్య చేశారు. అనంతరం తానూ రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఒడిశాలోని కలహండి జిల్లాలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మృతురాలి పేరు బిమలా మాంఝీ. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబంతో కలిసి జిల్లాలోని భవానీపట్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగజ్ హరన్ గ్రామంలో నివసిస్తున్నారు. భార్య, భర్త రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా బిమల తన భర్తతో రోజూ గొడవ పడుతుండేవారని సింగజ్ హరన్ గ్రామస్తులు చెబుతున్నారు.
భర్త రోజూ మద్యం సేవించి వచ్చేవాడని, బిమలను చితకబాదుతుండేవాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కలహాలకు ఆర్థిక ఇబ్బందులు తోడు కావడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం తెల్లవారు జామున నిద్రపోతున్న తన ఇద్దరు కుమారులు రవీంద్ర మాఝీ, దుష్యంత్ మాఝీల గొంతు కోసి, హత్య చేశారు.

అనంతరం తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. బిమలా మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు భవానీపట్నా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇంటికి వెళ్లి చూడగా.. రవీంద్ర మాఝీ, దుష్యంత్ మాఝీ రక్తపు మడుగులో కనిపించారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications