ఏడాది పాటు చేశాడు: సహజీవనం చేసిన యువతి, గతంలో రూ.1.50కు సెటిల్
జైపూర్: రాజస్థాన్లో ఓ 22 ఏళ్ల యువతి తాను సహజీవనం చేసిన వ్యక్తి పైన అత్యాచారం కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తన పైన పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ బాధిత యువతి ఫిర్యాదు చేసిందని పోలీసులు బుధవారం తెలిపారు.
బాధిత మహిళ రాంగంజ్ పోలీసు స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేసింది. సదరు యువతికి గతంలోనే పెళ్లైంది. ఆ తర్వాత కొద్ది రోజులుగా ఆమె తన భర్త నుండి వేరుగా ఉంటోంది. అనంతరం ఓ వ్యక్తితో సహజీవనం చేసింది. తనను 25 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపించింది.

తామిద్దరం కలిసి ఈద్గా ప్రాంతంలో గత ఏడాది కాలంగా కిరాయి ఇంటిలో ఉంటున్నామని, అప్పటి నుండి సహజీవనం చేస్తున్నామని ఫిర్యాదులో పేర్కొంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పలుమార్లు కోరికలు తీర్చుకొని, ఇప్పుడు మాట తప్పాడని పేర్కొంది.
నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలి వాంగ్మూలాన్ని తీసుకుంటామని, అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం పంపిస్తామని చెప్పారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు సెక్షన్ 376 తదితర సెక్షన్ల కిందే నిందితుడు ఆరీఫ్ పైన కేసు నమోదు చేశారు. అతనిని అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఇలాంటి కేసునే ఈ మహిళ 2010వ సంవత్సరంలో మరో వ్యక్తి పైన పెట్టింది. అనంతరం లక్షా యాభై వేల రూపాయలకు సెటిల్ చేసుకుంది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications