వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మత్తు మందు ఇచ్చింది: నగలు, తుపాకితో ఎస్కేప్

|
Google Oneindia TeluguNews

లక్నో: కుటుంబ సభ్యులను నమ్మించి మాయమాటలు చెప్పి వారికి ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చిన యువతి ఇల్లు లూటీ చేసి మాయం అయిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఇల్లు లూటీ కావడం, యువతి అదృశ్యం కావడంతో పోలీసులు గాలిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో సరిత అనే యువతి నివాసం ఉంటున్నది. సోమవారం రాత్రి సరిత మత్తు మందు కలిపి ఉన్న ఆహారపదార్థాలను కుటుంబ సభ్యులకు ఇచ్చింది. కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు మత్తులోకి జారుకున్నారు.

Woman flee from home with jewellery, pistol, cash in Uttar Pradesh

తరువాత సరిత ఇంటిలో గాలించి రూ. 20 లక్షల విలువైన బంగారు నగలు, నగదు, లైసెన్స్ ఉన్న తుపాకి చేతపట్టుకుని ఇంటి నుంచి పరారైయ్యింది. మంగళవారం ఉదయం మత్తులో నుంచి కుటుంబ సభ్యులు బయటపడ్డారు.

సరిత కనపడకపోవడంతో గాలించారు. అదే సమయంలో ఇంటిలో నగదు, నగలు, తుపాకి మాయం అయ్యిందని గుర్తించి కోత్వాలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ఎవ్వరిని అరెస్టు చెయ్యలేదని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
A young woman fled from home with cash and jewellery worth Rs 20 lakh and a licenced pistol after drugging her family members in Firozabad in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X