Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రతి నెలా రూ. 3,000 సాయం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు

పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న శాసనసభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల అయింది. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కొద్దిసేపటి కిందటే కోల్‌కతాలో దీన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చారు. రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల వారికీ తాయిలాలు ప్రకటించారు. చొరబాటుదారులపై కఠిన చర్యలు, మెరుగైన శాంతిభద్రతల కల్పన, మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం, 7వ వేతన సంఘం అమలు వంటివి ఇందులో ఉన్నాయి.

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఉమ్మడి పౌర స్మృతి (UCC)ని అమలు చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలు ఇందులో పొందుపరిచామని, ఓ సమగ్ర రోడ్‌మ్యాప్‌లా వీటిని బెంగాల్ ప్రజల ముందు ఉంచామని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని, హృదయపూర్వకంగా మార్పు కోరుకుంటున్నారని, ఇది తమతోనే సాధ్యమని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తుపై బీజేపీ విజన్‌ను ఈ మేనిఫెస్టో ప్రతిబింబిస్తుందని వివరించారు.

Women and Youth Each will Get 3000 Monthly Aid and 33 quota for women in all State Govt jobs BJP Promises

బీజేపీ తన సంకల్ప పత్రం ద్వారా పలు కీలక వాగ్దానాలు చేసింది. రాష్ట్రంలో చొరబాటుదారులపై జీరో టోలరెన్స్ విధానాన్ని అనుసరించి, కఠిన చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టో పేర్కొంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఏడవ వేతన సంఘం సిఫార్సులను 45 రోజుల్లో అమలు చేస్తారు. పశ్చిమ బెంగాల్‌లో ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తారు. మహిళా సాధికారత కోసం ప్రతినెలా రూ. 3,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

పోలీస్ శాఖతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. నిరుద్యోగ యువతకు కూడా నెలకు రూ. 3,000 ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వాలనేది బీజేపీ లక్ష్యం. ఈ ప్రణాళికలో అందరికీ న్యాయం, సరిహద్దుల భద్రతకు హామీ ఇవ్వడంతో పాటు, బెంగాల్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే 'వందేమాతరం మ్యూజియం' నిర్మాణ హామీ కూడా ఉంది. ఇది రాష్ట్ర ప్రజల సమగ్ర వికాసం, భద్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.

మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం అమిత్ షా తృణమూల్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుడు హామీలు, చొరబాటుదారులతో సంబంధాల వల్ల మూడు దఫాలు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. కమ్యూనిస్టులను వదిలించుకోవడానికి బెంగాల్ ప్రజలు మమత బెనర్జీని ఎన్నుకున్నారని, టీఎంసీ పాలనలో సిండికేట్లు, గూండారాజ్, చొరబాటుదారులతో ప్రభుత్వం నడుస్తోందని ధ్వజమెత్తారు. ఒకప్పుడు మమతకు మద్దతు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు ఆమెకు మరోసారి అవకాశం ఇవ్వడానికి భయపడుతున్నారని ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+