ఒమిక్రాన్ మరో వెర్షనే ఎక్స్ఈ వేరియంట్, అప్రమత్తత అవసరమే: కేంద్రమంత్రి మాండవీయ
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి తగ్గుతున్నవేళ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎక్స్ఈ కలవరపెడుతోంది. కోవిడ్ XE వేరియంట్కు సంబంధించిన భయాలను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం స్పష్టం చేశారు, ఇది ఓమిక్రాన్ మరొక వెర్షన్ మాత్రమే అని అన్నారు.
కరోనా మహమ్మారి ఇంకా ముగియనందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మాండవీయ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాండవీయ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ భారతదేశంలో ప్రవేశించిన 2020 నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు.

"మహమ్మారి ఇంకా ముగియనందున ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి," అని కేంద్రమంత్రి అన్నారు. రేపటిని మనం అంచనా వేయలేమన్నారు. "XE వేరియంట్ అనేది Omicron BA.1, BA.2 -- రెండు ఉప-వేరియంట్ల కలయిక లేదా రీకాంబినెంట్." అని మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
దేశంలో 12ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడంపై నిపుణులతో చర్చలు జరుపుతున్నామని, వారి సూచనల తర్వాత ముందుకు వెళతామని కేంద్రమంత్రి తెలిపారు. బూస్టర్ డోస్ ధరపై రూ.225 పరిమితిని విధించడంపై ఆయన స్పందిస్తూ.. ఇది గరిష్ట ధర అని, భవిష్యత్తులో ఎక్కువ మంది వ్యాక్సిన్ తయారీదారులు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నందున పోటీ కారణంగా ఇది ఇంకా తగ్గవచ్చని అన్నారు.
60 ఏళ్లు పైబడిన జనాభాకు ముందుజాగ్రత్త మోతాదు లేదా బూస్టర్ డోస్ ఉచితంగా అందించబడుతోంది. అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు ప్రైవేట్ సౌకర్యాల వద్ద తీసుకోవలసి ఉంటుంది.
భారతదేశంలోని అర్హతగల జనాభాలో 97 శాతం మందికి టీకా మొదటి మోతాదు ఇవ్వబడింది, అయితే 85 శాతం మంది పూర్తిగా టీకాలు వేయబడ్డారు, ఇది వైరస్కు వ్యతిరేకంగా భారతదేశం పోరాటాన్ని పెంచిందని మాండవీయ వెల్లడించారు.
ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో మొత్తం మరణాల రేటు (TFR) గణనీయంగా తక్కువగా ఉందని కూడా కేంద్రమంత్రి మాండవీయ చెప్పారు. ప్రపంచ సగటు 788 మరణాలతో పోలిస్తే భారతదేశంలో ప్రతి మిలియన్ జనాభాకు 380 మరణాలు నమోదయ్యాయని ఆయన చెప్పారు. భారతదేశం కూడా సంక్రమణ వ్యాప్తిని పరిమితం చేయగలిగింది, ప్రపంచవ్యాప్తంగా 63,458కి వ్యతిరేకంగా మిలియన్కు 31,383 కేసులు నమోదయ్యాయి అని తెలిపారు.












Click it and Unblock the Notifications