రుణ మాఫీపై యడ్యూరప్ప కసరత్తు: 24 గంటల్లో నివేదికకు రెవిన్యూ శాఖకు ఆదేశం
బెంగుళూరు: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీని అమలు చేసే దిశగా కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప నడుం బిగించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత రూ.56వేల కోట్ల విలువైన రైతుల రుణాలను మాఫీ చేసే దిశగా యడ్యూరప్ప ప్రయత్నాలను ప్రారంభించారు.
Recommended Video

ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే రైతు రుణాలను మాఫీ చేస్తామని హమీ ఇచ్చారు.ఈ హమీ మేరకు రైతు రుణ మాఫీకి తీసుకోవాల్సిన చర్యలపై యడ్యూరప్ప సర్కార్ నడుంబిగించింది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత యడ్యూరప్ప రెవిన్యూ సెక్రటరీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రూ.లక్షలోపు రైతుల రుణాలను మాఫీ చేసేందుకు అవకాశాలను అన్వేషించాలని యడ్యూరప్ప రెవిన్యూ సెక్రటరీని ఆదేశించారు.
అయితే ఈ విషయమై 24 గంటల్లోపుగా తనకు స్పష్టమైన నివేదికను ఇవ్వాలని ముఖ్యమంత్రి యడ్యూరప్ప రెవిన్యూ సెక్రటరీని ఆదేశించారు. అయితే రైతులకు పంట రుణాలను రద్దు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో బిజెపి వాగ్దానం చేసింది. ఈ వాగ్దానాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని ముఖ్యమంత్రి యడ్యూరప్ప భావిస్తున్నారు.
రైతాంగం సంక్షేమం కోసం పాటుపడనున్నట్టు బిజెపి తన మేనిఫెస్టోలో ప్రకటించింది. కర్ణాటక రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు రూ.1.5 కోట్లను ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications