రుణ మాఫీపై యడ్యూరప్ప కసరత్తు: 24 గంటల్లో నివేదికకు రెవిన్యూ శాఖకు ఆదేశం
బెంగుళూరు: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీని అమలు చేసే దిశగా కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప నడుం బిగించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత రూ.56వేల కోట్ల విలువైన రైతుల రుణాలను మాఫీ చేసే దిశగా యడ్యూరప్ప ప్రయత్నాలను ప్రారంభించారు.
Recommended Video

ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే రైతు రుణాలను మాఫీ చేస్తామని హమీ ఇచ్చారు.ఈ హమీ మేరకు రైతు రుణ మాఫీకి తీసుకోవాల్సిన చర్యలపై యడ్యూరప్ప సర్కార్ నడుంబిగించింది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత యడ్యూరప్ప రెవిన్యూ సెక్రటరీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రూ.లక్షలోపు రైతుల రుణాలను మాఫీ చేసేందుకు అవకాశాలను అన్వేషించాలని యడ్యూరప్ప రెవిన్యూ సెక్రటరీని ఆదేశించారు.
అయితే ఈ విషయమై 24 గంటల్లోపుగా తనకు స్పష్టమైన నివేదికను ఇవ్వాలని ముఖ్యమంత్రి యడ్యూరప్ప రెవిన్యూ సెక్రటరీని ఆదేశించారు. అయితే రైతులకు పంట రుణాలను రద్దు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో బిజెపి వాగ్దానం చేసింది. ఈ వాగ్దానాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని ముఖ్యమంత్రి యడ్యూరప్ప భావిస్తున్నారు.
రైతాంగం సంక్షేమం కోసం పాటుపడనున్నట్టు బిజెపి తన మేనిఫెస్టోలో ప్రకటించింది. కర్ణాటక రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు రూ.1.5 కోట్లను ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications