వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: పోలీసులమని చెప్పి స్కూల్ టీచర్‌పై సామూహిక అత్యాచారం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐదుగురు వ్యక్తులు పోలీసుల వేషంలో వచ్చి 21 ఏళ్ల స్కూల్ టీచర్‌ను కిడ్నాప్ చేసి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన మాహారాష్ట్రలోని నాగ్‌పూర్ పట్టణంలో కలమన ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగింది. బాధిత మహిళ తన స్నేహితుడితో కలిసి బైకు మీద వెళ్తుండగా కప్సీ ప్లై ఓవర్ ప్రాంతంలో అడ్డు తగిలారు.

 Young teacher abducted, gang-raped in Nagpur

తాము పోలీసులం అని చెప్పి, వాళ్లిద్దరినీ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్తున్నామని చెప్పి ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. తనతో పాటు వచ్చిన స్నేహితుడిని మార్గం మధ్యలోనే దించేసి... ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అత్యాచారం చేశారు.

ఆ తర్వాత బాధితురాలిని వాళ్ల ఇంటి సమీపంలో వదిలిపెట్టారు. ఆమెపై ఈ అత్యాచారానికి పాల్పడినవారు ఆమెకు బాగా తెలిసున్నవాళ్లే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నాగ్‌పూర్ పట్టణంలోని కలమన పోలీసు స్టేషన్‌లో స్నేహితుడి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కిడ్నాప్, రేప్ కేసులు నమోదు చేశామన్నారు.

English summary
A young school teacher was allegedly abducted and gang-raped by five unidentified men, posing as policemen, after they stopped the victim near Kapsi flyover here, police said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X