దారుణం: పోలీసులమని చెప్పి స్కూల్ టీచర్పై సామూహిక అత్యాచారం
న్యూఢిల్లీ: ఐదుగురు వ్యక్తులు పోలీసుల వేషంలో వచ్చి 21 ఏళ్ల స్కూల్ టీచర్ను కిడ్నాప్ చేసి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన మాహారాష్ట్రలోని నాగ్పూర్ పట్టణంలో కలమన ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగింది. బాధిత మహిళ తన స్నేహితుడితో కలిసి బైకు మీద వెళ్తుండగా కప్సీ ప్లై ఓవర్ ప్రాంతంలో అడ్డు తగిలారు.
తాము పోలీసులం అని చెప్పి, వాళ్లిద్దరినీ పోలీసు స్టేషన్కు తీసుకెళ్తున్నామని చెప్పి ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. తనతో పాటు వచ్చిన స్నేహితుడిని మార్గం మధ్యలోనే దించేసి... ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అత్యాచారం చేశారు.
ఆ తర్వాత బాధితురాలిని వాళ్ల ఇంటి సమీపంలో వదిలిపెట్టారు. ఆమెపై ఈ అత్యాచారానికి పాల్పడినవారు ఆమెకు బాగా తెలిసున్నవాళ్లే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నాగ్పూర్ పట్టణంలోని కలమన పోలీసు స్టేషన్లో స్నేహితుడి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కిడ్నాప్, రేప్ కేసులు నమోదు చేశామన్నారు.