దారుణం: 7నెలల ఆవుదూడపై యువకుడి అత్యాచారం!
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఏకంగా ఆవుదూడ పైన అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. అమ్మాయిలకే రక్షణ లేకుండా పోయిందని ఎంతోమంది ఆవేదన చెందుతున్నారు.
ఇప్పుడు నిందితుడు ఆవుదూడ పైన కూడా ఆఘాయిత్యానికి పాల్పడటం గమనార్హం. బులంద్ షెహర్లోని ఈ సంఘటన జరిగింది.

అహ్మద్ నగర్లోని మండనగ్ల గ్రామానికి చెదిన 25 ఏళ్ల యువకుడు దినేష్ మంగళవారం నాడు ఏడు నెలల ఆవు దూడ పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. దానిని గమనించిన యజమాని సుఖ్ పాల్ (35) బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు నిందితుడు పైన సెక్షన్ 377 కింద కేసు నమోదు చేశారు. అతను పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు. పరీక్షల నిమిత్తం దూడను ఆసుపత్రికి తరలించారు. రిపోర్టులు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.












Click it and Unblock the Notifications