నగ్న ఫోటోలతో ఇంటర్ విద్యార్థినిని బ్లాక్ మెయిల్ ఆపై రేప్
చండీగఢ్: ఇంటర్ విద్యార్ధిని అత్యాచారం చేసి, బ్లాక్ మెయిల్కు పాల్పడిన కేసులో లలిత్ (21) అనే యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన హర్యానాలోని ఫరీదాబాద్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఓ మెడికల్ స్టోర్లో పనిచేస్తున్న లలిత్ అనే యువకుడు గత కొంతకాలంగా వేధిస్తున్నట్టు బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రతి రోజూ టీజ్ చేసే లలిత్ గత నెలలో బలవంతంగా అతని స్నేహితుడు గౌరవ్ ఇంటికి తీసుకెళ్లి తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. తనను నగ్నంగా ఫోటోలు తీసి అసలు విషయాన్ని బయటకు చెబితే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని లలిత్ బెదిరించాడని పేర్కొంది.

ఈ నగ్న చిత్రాల ద్వారా బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని బెదిరించినట్టు బాధితురాలు వెల్లడించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ సంఘటనలో నిందితుడిని ఇంకా అదుపులోకి తీసుకోలేదు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications