పెళ్లి పేరుతో యువతిపై 8నెలలపాటు అత్యాచారం
ఛండీఘర్: పంజాబ్లోని ఫతేఘర్ చురియన్ ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై పలుమార్లు అత్యాచారం చేసి మోసం చేశాడో దుర్మార్గుడు.
24ఏళ్ల ఆలం విజయ్ సింగ్ అనే యువకుడు 22ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎనిమిది నెలలుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.
విషయం బయటకు చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలం విజయ్తో పాటు అతడికి సహకరించినందుకు ఆలం కుటుంబసభ్యులపై కూడా కేసు నమోదు చేశారు.

యువతుల ఫొటోలు తీసి దొరికిపోయాడు
కొందరు యువతులను వెక్కిరించడంతోపాటు వారిని సెల్ఫోన్లో చిత్రీకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-లజ్పతినగర్ రహదారిలో చోటు చేసుకుంది. నిందితుడు ఆ యువతులను బెదిరింపులకు గురిచేసినట్లు పోలీసులు తెలిపారు.
తమ వెంటపడి ఫొటోలు తీశాడని ఓ బాధితురాలు పోలీసులకు తెలిపింది. అతడ్ని అడ్డుకుంటే యాసిడ్ దాడి చేస్తానని బెదిరింపులకు గురి చేస్తానని బెదిరించాడని పోలీసులకు చెప్పింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు మహ్మద్ జరీఫ్ను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications