13 మంది పోలీసుల మృతి.. చెక్ పోస్ట్ లక్ష్యంగా ఐఎస్ ఉగ్రమూకల దాడి.. పలువురికి గాయాలు
ఇరాక్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. పోలీస్ చెక్ పోస్టును లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 13 మంది ఇరాక్ పోలీసులు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. అల్ రషాద్ ప్రాంతంలో కిర్కుక్ నగరానికి సమీపంలో అర్ధరాత్రి తర్వాత ఈ దాడి జరిగిందని ఇరాక్ భద్రతా బలగాలు వెల్లడించాయి.ఇస్లామిక్ స్టేట్ ఆర్గనైజేషన్ ఉగ్రవాదులు దాడి చేశారని అధికారులు పేర్కొన్నారు.
ఇరాక్ లోని పలు ప్రాంతాలను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న ఐఎస్ఐఎస్ తరచుగా సైన్యం, పోలీసులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది. ఈ ఏడాది జులై 19న రాజధాని బాగ్దాద్ శివారు ప్రాంతంలో బాంబు దాడి జరిపి 30 మందిని పొట్టనబెట్టుకుంది. ప్రస్తుతం ఇరాక్ లో సంకీర్ణ దళాల సంఖ్య 3,500 కాగా, వాటిలో 2,500 మంది అమెరికా సైనికులు ఉన్నారు.

Recommended Video
జో బైడెన్ అధికారంలోకి వచ్చాక మధ్య ప్రాచ్యం, ఆసియా వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమ దళాలను పూర్తిగా వెనక్కి పిలిపించారు. ఇరాక్ లోనూ వచ్చే ఏడాది నుంచి స్థానిక సైన్యానికి శిక్షణ, సలహాలు ఇచ్చేందుకే తమ బలగాలను పరిమితం చేయాలని బైడెన్ నిర్ణయించారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications