Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

40 గంటల భీకర పోరు: 145 మంది ఉగ్రవాదులు హతం!

పాకిస్థాన్‌‌లోని నైరుతి ప్రావిన్స్ అయిన బెలూచిస్థాన్ మరోసారి రక్తసిక్తమైంది. బెలూచిస్థాన్‌లో గత 40 గంటలుగా భీకర పోరు సాగుతోంది. బెలూచ్ వేర్పాటువాద గ్రూపులు ఏకకాలంలో జరిపిన దాడులతో ఆ ప్రాంతం అట్టుడికిపోయింది. గత 40 గంటలుగా సాగుతున్న ఈ భీకర పోరులో ఇప్పటివరకు 145 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు బెలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఆదివారం క్వెట్టాలో వెల్లడించారు. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో హింస చెలరేగడం ఇదే తొలిసారి.

'ఆపరేషన్ హెరోఫ్' పేరుతో ఉగ్రవాదుల విధ్వంసం
బెలూచిస్థాన్‌లోని క్వెట్టా, గ్వాదర్, మస్తుంగ్, నోష్కీ వంటి పలు జిల్లాల్లో ఉగ్రవాదులు ఏకకాలంలో సమన్వయంతో దాడులకు తెగబడ్డారు. దీనిని 'హెరోఫ్' (నల్ల తుఫాను) ఆపరేషన్‌గా పేర్కొన్న నిషేధిత వేర్పాటువాద సంస్థ 'బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ' (BLA) ఈ దాడులకు బాధ్యత వహించింది. భద్రతా దళాలు, సామాన్యులు, కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఈ మారణకాండ సాగింది. ఈ దాడుల్లో 17 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోగా.. 31 మంది అమాయక పౌరులు ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. ఈ క్రమంలో పాక్ సైన్యం 145 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలిసింది.

145 Militants Killed in Balochistan Pakistan Blames India MEA Rejects Baseless Allegations

భారత్‌పై నిందలు
ఎప్పటిలాగే ఈ సారి కూడా పాకిస్థాన్ తన అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి భారత్‌పై నిందలు వేసే ప్రయత్నం చేసింది. ఈ దాడుల వెనుక భారత మద్దతు ఉన్న ఉగ్రవాదులు ఉన్నారని పాక్ సైన్యం ఆరోపించింది. అయితే ఈ వాదనను భారత విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా ఖండించింది. "పాకిస్థాన్ చేస్తున్నవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు. తన దేశంలో పెరుగుతున్న అసంతృప్తి, అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే పాకిస్థాన్ ఇలాంటి పాత పద్ధతులను అనుసరిస్తోంది. తన సొంత ప్రజల డిమాండ్లను వినడంపై పాక్ దృష్టి పెడితే మంచిది" అని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ హితవు పలికారు.

బెలూచిస్థాన్ అసంతృప్తి కారణాలేంటి?
వైశాల్యం పరంగా పాకిస్థాన్‌లో అతిపెద్ద రాష్ట్రం బెలూచిస్థాన్. ఇక్కడ గ్యాస్, ఖనిజ సంపద పుష్కలంగా ఉన్నప్పటికీ.. పాక్ ప్రభుత్వం ఆ వనరులను దోచుకుంటూ తమను పేదరికంలో ఉంచుతోందని బెలూచ్ ప్రజల ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) వంటి ప్రాజెక్టుల వల్ల స్థానికులకు ఎలాంటి ప్రయోజనం లేదని, పైగా తమ భూములు కోల్పోతున్నామని వేర్పాటువాద గ్రూపులు దశాబ్దాలుగా సాయుధ పోరాటం చేస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితి
ప్రస్తుతం బెలూచిస్థాన్‌లోని ప్రధాన రహదారులను భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదులు నగరాలను స్వాధీనం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలను భగ్నం చేసినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. ఆసుపత్రులలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అయితే మారుమూల ప్రాంతాల్లో ఇంకా క్లియరెన్స్ ఆపరేషన్లు కొనసాగుతుండటంతో ఉద్రిక్తత ఇంకా తగ్గలేదు. బెలూచిస్థాన్ సమస్య పాకిస్థాన్‌కు ఓ పెద్ద తలనొప్పిగా మారింది. కేవలం సైనిక చర్యల ద్వారానే కాకుండా, అక్కడి ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించకుంటే ఈ రక్తపాతం ఆగదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+