ఏడాదిలో 18వేల మందికి మైక్రోసాప్ట్ ఉద్వాసన, ఇంకా..!
న్యూఢిల్లీ: నోకియాను సొంతం చేసుకున్న తర్వాత గడిచిన ఏడాదిలో మైక్రోసాప్ట్లో చాలా మార్పులు జరిగాయి. ఆధునాతన సాంకేతికత, ఆటోమేషన్ పేరుతో గడచిన ఏడాది వ్యవధిలో వివిధ స్ధాయిల్లో 10 వేల మందిని మైక్రోసాప్ట్ తొలగించింది.
ఇందులో 5000 మంది మైక్రోసాప్ట్కు చెందిన వారు కాగా మిగిలిన వారు నోకియా కంపెనీకి చెందిన వారు కావడం గమనార్హం. రాబోయే రోజుల్లో మరికొంత మందిని తొలగించనున్నట్లు సంకేతాలు పంపింది. ఖర్చులను మరింతగా తగ్గించుకోవాలని భావిస్తున్నామని, ఈసారి హార్డ్వేర్ విభాగంలో పనిచేస్తున్న వారిని తొలగించే అవకాశాలున్నాయని తెలిసింది.

గతేడాది నోకియా వ్యాపారాన్ని 7.2 బిలియన్ డాలర్ల (సుమారు 43 వేల కోట్లు)తో కొనుగోలు చేసిన తర్వాత ఆ మేరకు ఆదాయాన్ని పెంచుకోవడంలో మైక్రోసాప్ట్ విఫలమైంది. ఈ నష్టాన్ని భరించేందుకు గాను మైక్రోసాఫ్ట్కు చెందిన యాడ్ బిజినెస్ వ్యాపారాన్ని జూన్లో ఏఓఎల్కు విక్రయించింది.
అయినా ఆశించినంత స్దాయిలో మంచి ఫలితాలను నమోదు చేయకపోవడంతో హార్డ్ వేర్ రంగం నుంచి దశలవారీగా తప్పుకోవాలని యోచనలో ఉన్నట్లు సమాచారం. అత్యంత క్లిష్టమైన దశలో ఉన్న మైక్రోసాప్ట్కు ప్రస్తుతం సత్య నాదెళ్ల సీఈఓగా కొనసాగుతున్నారు.
-
గుడ్ న్యూస్ : భారత నౌకాదళంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications